News March 18, 2025

ఇంటి వద్దకే రాములు వారి తలంబ్రాలు: ఆర్టీసీ RM బి.రాజు

image

భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని పురస్కరించుకొని అక్కడకు వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామని RM బి.రాజు తెలిపారు. ఇందుకు గాను ఒక్కొక్క ప్యాకెట్ కు రూ.151 ఆన్లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, ఏజెంట్ కౌంటర్ల వద్ద గాని బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

Similar News

News January 16, 2026

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు

image

బరక్‌పోర్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<>HAL<<>>) 62 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా అప్రెంటిస్‌లు JAN 28న, డిగ్రీ (BCom,BSc/BCA)ఉత్తీర్ణులు JAN 29న, బీఈ/బీటెక్ అర్హతగల వారు JAN 30న వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in

News January 16, 2026

పచ్చని ఓరుగల్లులో పశువుల పండుగ!

image

పచ్చని పంటలతో నిత్యం కళకళలాడే ఓరుగల్లు వ్యవసాయానికి పెట్టింది పేరు. సంక్రాంతి సంబరాల్లో మూడో రోజైన కనుమ సందర్భంగా.. రైతన్నకు చేదోడువాదోడుగా నిలిచే పశువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఎడ్లను రంగులతో ముస్తాబు చేసి, గజ్జెలు, మువ్వలతో అలంకరిస్తారు. ‘పాలి’ పోసి నైవేద్యాలు సమర్పిస్తారు. పలు చోట్ల ఎడ్ల బండ్ల ప్రదర్శనలు నిర్వహిస్తారు. ‘పాడి పంట చల్లగ చూడు.. సిరులు పండేలా దీవించు’ అంటూ దేవుడిని వేడుకుంటారు.

News January 16, 2026

కనుమ రోజు మాంసాహారం తీసుకోకూడదా?

image

ఆధ్యాత్మికపరంగా కనుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు పశువులను దైవంగా భావించి పూజిస్తారు కాబట్టి మాంసాహారం తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘మొదటి మూడు రోజులు శాకాహారంతో దైవచింతనలో గడపడం శ్రేయస్కరం. మాంసాహార ప్రియులు నాలుగవ రోజైన ‘ముక్కనుమ’ నాడు తమకు ఇష్టమైన వంటకాలను వండుకుని తింటారు. కనుమ రోజున పశువుల పట్ల కృతజ్ఞత చూపిస్తూ, శాకాహార నియమాన్ని పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.