News March 18, 2025

ఎన్టీఆర్: అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ (2022, 23, 24 బ్యాచ్‌లు) రెగ్యులర్, సప్లిమెంటరీ(థియరీ) పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 28లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలన్నారు. పరీక్షల షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.

Similar News

News November 12, 2025

మంత్రి గారూ.. కురవి వీరన్నను దర్శించుకునేది ఎప్పుడో..!

image

MHBD జిల్లాలోని కురవి శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకమైనది. అయితే, జిల్లాలోనే ఉంటూ దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి కొండా సురేఖ మాత్రం ఇప్పటి వరకు వీరన్నను దర్శించుకోలేదు. దీంతో కోరిన వరాలనిచ్చే కొంగుబంగారమైన వీరన్నకు సైతం మేడారం తరహాలోనే నిధులు మంజూరు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, వీరన్నను మంత్రి దర్శించుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

News November 12, 2025

ప్రభుత్వ వైఫల్యం వల్లే పేలుడు: ఖర్గే

image

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఢిల్లీ బ్లాస్ట్‌ జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘దేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. IB, CBI లాంటి ఏజెన్సీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విఫలమైంది. దర్యాప్తు నివేదిక వచ్చాక మేం మరింత మాట్లాడతాం’ అని తెలిపారు.

News November 12, 2025

నరసరావుపేట: ఎలుకల నివారణ గోడపత్రికల ఆవిష్కరణ

image

సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ భాగస్వాములై తమ పంటలను ఎలుకల బారినుంచి కాపాడుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంపై గోడపత్రికలు ఆవిష్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా అందించిన బ్రోమోడయోలిన్‌ మందును నూనెతో కలిపిన నూకలను తీసుకొని విషపు ఎరను తయారు చేసుకోవాలని చెప్పారు.