News March 18, 2025
చిగురాకు తొడిగిన భారతావని ‘చివరి’ అంచు!

ఆకాశం అందమైన కాన్వాస్ అయితే దానిపై ప్రతి రోజు రూపుదిద్దుకున్న చిత్రాలెన్నో. కళాత్మకంగా కూడిన మనసు ఉండాలే కానీ ఆకాశంలో ఉండే మేఘాలు, ఏపుగా పెరిగిన చెట్లు ఎన్నో రకాల అద్భుతమైన రూపంలో కనిపిస్తాయి. వరంగల్ నగరంలోని నర్సంపేట రోడ్డులో పచ్చని చెట్ల కొమ్మలు భారతదేశ పటం చివరి భాగం రూపంలో పచ్చదనంతో అల్లుకొని ఉన్న చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.
Similar News
News January 4, 2026
మీకోసం వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చు: కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి

పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను 1100కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.
News January 4, 2026
సింగరేణి నెగ్లిజెన్సీ.. విలువైన సంపద మాయం

అక్రమ దందాలు, చోరీలతో సింగరేణి ప్రతిష్ఠ మసకబారుతోంది. సింగరేణిలో భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు, స్టోర్ యార్డులు, స్క్రాప్ డిపోలలో చోరీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ప్రొడక్షన్ టైంలో తక్కువ బరువు చూపించి రాత్రివేళలో అదనపు బొగ్గు లోడ్లు తరలిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారట. విలువైన సింగరేణి సంపద చోరీకి గురవుతున్న సెక్యూరిటీ చేతులెత్తేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
News January 4, 2026
ప.గో: అక్క అనే పిలుపునకు అండగా నిలిచి.. తలకొరివి పెట్టి మానవత్వం చాటి..

రక్త సంబంధం లేకపోయినా చిన్న పిలుపుతో ఏర్పడిన అనుబంధం మానవత్వాన్ని చాటింది. బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను(45) శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, బంధువులు ఎవరూ రాలేదు. దీంతో శ్రీను ‘అక్క’ అని పిలిచే పొరుగున ఉన్న పతివాడ మావూళ్లమ్మ చలించిపోయింది. తానే స్వయంగా తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఆమె చూపిన ఈ చొరవను చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటూ, మావూళ్లమ్మ పెద్దమనసును అభినందించారు.


