News March 18, 2025

ములుగు: ‘పది’ పరీక్ష పదిలంగా!

image

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరంతా సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 3,134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

Similar News

News February 28, 2026

ఇంటర్ పరీక్షల్లో పొరపాట్లకు తావుండొద్దు: కలెక్టర్

image

గద్వాల జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్, బాలికల కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిట్టింగ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.

News February 28, 2026

NRPT: మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ

image

మీసేవ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు మొబైల్ యాప్‌ను విధిగా వినియోగించాలని నారాయణపేట అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, జీపీఓలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ యాప్ వినియోగంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

News February 28, 2026

బాపట్లలో పింఛన్ పంపిణీ చేసిన కలెక్టర్

image

బాపట్ల మున్సిపాలిటీలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పెన్షన్లు సమయానికి, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో, తహశీల్దార్ ఉన్నారు.