News March 24, 2024

విద్యార్థిని జేబులో మొబైల్ ఫోన్‌కు మంటలు

image

ఇటీవల మొబైల్ ఫోన్లు పేలిపోతున్న ఘటనలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఓ కోచింగ్ సెంటర్‌లో క్లాస్ జరుగుతుండగా విద్యార్థిని జేబులోని రెడ్‌మీ ఫోన్ నుంచి మంటలు వచ్చాయి. ఆమె వెంటనే ఫోన్‌ను రోడ్డుపైకి విసిరేయగా, సైన్ బోర్డుకు తగిలి పేలిపోయింది. స్థానికులు మంటలు ఆర్పేశారు. అక్కడికి సమీపంలోనే దుస్తుల షాపులు ఉన్నాయి. అటువైపు ఫోన్ పడి ఉండే పెద్ద ప్రమాదం జరిగేది.

Similar News

News October 3, 2024

నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోం: Jr.NTR

image

ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమని Jr.NTR అన్నారు. నాగ చైతన్య-సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించింది. ఇలాంటి వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు’ అని ట్వీట్ చేశారు.

News October 3, 2024

అమల ట్వీట్‌కు అక్కినేని అఖిల్ మద్దతు

image

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల చేసిన <<14257006>>ట్వీట్‌కు<<>> అఖిల్ స్పందించారు. ‘అమ్మ.. మీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదు’ అని ట్వీట్ చేశారు.

News October 3, 2024

మంత్రి సురేఖ వ్యాఖ్యలు.. స్పందించిన హీరో నాని

image

చైతూ-సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని స్పందించారు. ‘తాము ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చని పొలిటీషియన్లు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇంత బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. దీనిని అందరూ ఖండించాలి’ అని ట్వీట్ చేశారు.