News March 18, 2025
కడియం: బాలికతో అసభ్యకర ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

కడియం మండలంలోని ఓ గ్రామానికి చెందిన చిన్న(60) మనవరాలు వరుసయ్యే బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధిత బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. తండ్రి అనారోగ్యంతో చనిపోగా.. తల్లి వేరే దేశంలో ఉంటోంది. బంధువుల ఇంటి వద్ద ఉంటున్న బాలికపై సదరు వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు.
Similar News
News March 19, 2025
రాజమండ్రీలో సందడి చేసిన కోర్టు చిత్ర బృందం

రాజమండ్రిలోని స్వామిథియేటర్లో మంగళవారం ‘కోర్ట్’ సినిమా యూనిట్ సందడి చేసింది. చిత్రంలో పులికొండ లాయర్ పాత్రపోషించిన ప్రియదర్శి, హీరో హర్షరోషన్, హీరోయిన్లు శ్రీదేవి,రిషిక, రైటర్ కమ్ డైరెక్టర్ రామ్ జగదీష్, మ్యూజిక్ డైరెక్టర్ తదితరులు పాల్గొని ప్రేక్షకులతో మాట్లాడారు. కోర్ట్ సినిమా అందర్ని గెలిపించిందన్నారు. మంచి చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలన్నారు.
News March 18, 2025
రాజమండ్రి: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సభ్యుల క్రీడా పోటీలు

ఎమ్మెల్యేలకు,ఎమ్మెల్సీలకు ఆహ్లాదాన్ని ఇచ్చే దిశగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రీడా పోటీల కోసం జరుగుతున్న ఏర్పాట్లను శాప్ ఛైర్మన్ రవి నాయుడుతో కలిసి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు సోమవారం పర్యవేక్షించారు. ఈ క్రీడా పోటీల్లో 173మంది ఎమ్మెల్యేలు, 31మంది క్రికెట్, 25 మంది బ్యాట్మెంటిన్ వాలీబాల్ ఆడనున్నారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు.
News March 17, 2025
రాజమండ్రి: భానుడి భగభగ

తూ.గో. జిల్లాలో అప్పుడే ఎండ దంచేస్తుంది. కొన్ని మండలాల్లో వడగాలుల వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం రాజమండ్రిలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది. వడ గాల్పులతో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు జాగ్రత్తలు తీసుకుని బయటికి రావాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.