News March 18, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..!

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ముత్తారం 40.1℃ నమోదు కాగా మంథని 40.1, రామగిరి 40.0, అంతర్గం 40.0, కాల్వ శ్రీరాంపూర్ 39.8, రామగుండం 39.7, ఓదెల 39.7, పాలకుర్తి 39.6, కమాన్పూర్ 39.3, సుల్తానాబాద్ 38.4, ధర్మారం 38.3, పెద్దపల్లి 36.6, ఎలిగేడు 35.7, జూలపల్లి 35.4℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది.
Similar News
News March 18, 2025
కామారెడ్డి కలెక్టరేట్కు మళ్లీ రప్పించారు

కామారెడ్డి జిల్లాలో 15మంది తహసిల్దార్లకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత బదిలీల్లో ప్రేమ్ కుమార్ను అధికారులు ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి కలెక్టరేట్కు బదిలీ చేశారు. ఇంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్లో విధులు నిర్వహించే ప్రేమ్ కుమార్ డిప్యూటేషన్పై ఎల్లారెడ్డి డీఎఓగా పంపగా మళ్లీ అతనినీ అధికారులు కలెక్టరేట్కు బదిలీ చేశారు.
News March 18, 2025
మాతృ, శిశు మరణాలు అరికట్టాలి: డీఎంహెచ్వో

మాతృ, శిశు మరణాలను నివారించాలని డీఎంహెచ్వో దేవి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. శిశు, మాతృ మరణాలు జరిగినప్పుడు మరణానికి ముందు ఎదురైన ఇబ్బందులు, కారణాలు తెలుసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. మరోసారి మరణం జరగకుండా వైద్యులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణి డెలివరీ తరువాత కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.
News March 18, 2025
సిద్ధార్థ్ను అభినందించిన సీఎం

అనంతపురానికి చెందిన 14ఏళ్ల బాలుడు సిద్ధార్థ్ నంద్యాల సీఎం చంద్రబాబును కలిశారు. ఏఐ సాయంతో గుండెజబ్బులు నిర్ధారించే సిర్కాడియావీ యాప్ను రూపొందించిన సిద్ధార్థ్ను సీఎం అభినందించారు. అరగంట పాటు అతడితో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని, మరిన్ని ఆవిష్కరణలు చేయాలని బాలుడిని సీఎం ప్రోత్సహించారు. కాగా సిద్ధార్థ్ రూపొందించిన యాప్ 7 సెకన్లలోనే గుండె పనితీరు చెప్పేస్తుంది.