News March 18, 2025
హసన్పర్తి: యాక్సిడెంట్.. ఇద్దరు విద్యార్థులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పరకాల బీసీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు సుశాంత్, వర్ధన్, విజయ్ ఆదివారం రాత్రి పరకాల నుంచి ఎర్రగట్టు జాతరకు బయలుదేరారు. సుశాంత్ బైక్ నడుపుతుండగా.. విజయ్, వర్ధన్ వెనుక కూర్చున్నారు. ముచ్చర్ల శివారులో వీరి బైకును ఓ వాహనం ఢీకొనడంతో సుశాంత్, విజయ్ మృతి చెందారు. వర్ధన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు.
Similar News
News July 5, 2025
HYD: నిమజ్జనాల కోసం రెడీమేడ్ పాండ్స్ ఏర్పాటు

రాబోయే వినాయక చవితి సందర్భంగా చిన్న విగ్రహాల నిమజ్జనాల కోసం రెడీమేడ్ పాండ్స్ సరఫరా కోసం సంబంధిత ఏజెన్సీలను జీహెచ్ఎంసీ ఆహ్వానిస్తోంది. ప్రస్తుతానికి సికింద్రాబాద్ జోన్కు సంబంధించి 20 మీటర్ల పొడవు,10 మీటర్ల వెడల్పు, 1.32 మీటర్ల లోతుతో ఉండే పోర్టబుల్ పాండ్స్ తయారీ ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించారు. కాగా POPతో చేసిన విగ్రహాలను నగరంలో నిమజ్జనం చేయరాదని హైకోర్టు తెలిపిన విషయం తెలిసిందే.
News July 5, 2025
బూర్గంపాడు: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బూర్గంపాడులో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ముదిరాజ్ వీధికి చెందిన నీరుడు సంధ్య(38) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. చికిత్స పొందుతూ ఇంటి వద్దనే ఉంటుంది. మనస్తాపంతో శుక్రవారం భర్త శేషయ్య పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి చెల్లి లీలావతి ఫిర్యాదు మేరకు SIప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News July 5, 2025
భేష్.. సిద్దిపేట కలెక్టర్ సేవలు

గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఏకంగా 8 గురుకులాలను తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలో అందుతున్న వసతులు, మధ్యాహ్న భోజనం, విద్య వంటి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. నేడు కొండపాక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల, మహాత్మ జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాలలో సందర్శించారు. బాగా చదువుకోవాని విద్యార్థులకు సూచించారు.