News March 18, 2025
తిరుగు ప్రయాణం మొదలు

అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ల తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం గం.10.36ని.లకు ISS నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ సపరేట్ అయింది. దీంతో భూమ్మీదకు వారి ప్రయాణం ప్రారంభమైంది. రేపు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున గం.3:27కు ఫ్లోరిడా తీర జలాల్లో ల్యాండ్ కానుంది.
Similar News
News March 18, 2025
రేపు, ఎల్లుండి జాగ్రత్త

AP: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. రేపు 58 మండలాల్లో, ఎల్లుండి 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని <
News March 18, 2025
కావలి గ్రీష్మ రాజీనామాకు ఆమోదం

AP: ఏపీ మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ పదవికి కావలి గ్రీష్మ ఈ నెల 9న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించగానే ఆమె రాజీనామా చేశారు. ఇటీవల ఆమె ఆ కోటాలో MLCగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం గ్రీష్మ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
News March 18, 2025
విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం: కన్నబాబు

AP: విశాఖ మేయర్ పీఠంపై <<15799147>>కూటమి కన్నేయడంతో<<>> వైసీపీ అప్రమత్తమైంది. ఇవాళ కార్పొరేటర్లతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు సమావేశయ్యారు. ఈ భేటీకి 34 మంది హాజరుకాగా, ముగ్గురు రాలేదు. తమ కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చీప్ పాలిటిక్స్ మానుకోవాలని CBNకు మాజీ మంత్రి అమర్నాథ్ హితవు పలికారు.