News March 18, 2025
VKB: నిరీక్షణకు ఫలితం దక్కింది

దుద్యాలకి చెందిన మాసుల పద్మమ్మ, చిన్న సాయన్న కొడుకు మాసుల శశివర్ధన్ నిరీక్షణకు ఫలితం దక్కింది. 11 సంవత్సరాలుగా విద్యాశాఖలో సీఆర్పిగా విధులు నిర్వర్తిస్తూ చదివి హాస్టల్ వెల్ఫేర్ జాబ్ సాధించాడు శశివర్ధన్. తల్లిదండ్రులు కలను నెరవేర్చాడు. అతణ్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News March 19, 2025
గేట్లో తెలుగు విద్యార్థి సత్తా.. ఆలిండియా ఫస్ట్ ర్యాంక్

AP: నెల్లూరు (D) ఆమంచర్లకు చెందిన సాదినేని నిఖిల్ గేట్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్తో మెరిశారు. డేటా సైన్స్, AI టెస్ట్ పేపర్లో 100కు గానూ 96.33 మార్కులతో ఈ ఘనత సాధించారు. గతంలో నీట్ పరీక్షలోనూ 57వ ర్యాంకు సాధించిన ఈయన ప్రస్తుతం నోయిడాలో ఎక్స్పర్ట్డాక్స్ అనే సంస్థలో పని చేస్తున్నారు. AIలో ఎంటెక్ చేయాలన్న తన కల సాకారం చేసుకునే లక్ష్యంతోనే కష్టపడి చదివినట్లు నిఖిల్ వివరించారు.
News March 19, 2025
నిర్మల్: పోటీ పరీక్షలపై దృష్టి సారించాలి : ఫైజాన్ అహ్మద్

విద్యార్థులు డిగ్రీ స్థాయి నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు గ్రూప్స్ ,సివిల్స్ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమైతే సులభంగా ర్యాంకులను సాధించవచ్చని పేర్కొన్నారు. పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
News March 19, 2025
గద్వాల జిల్లా బిడ్డ GOVT జాబ్ కొట్టింది..!

ఇటీవల విడుదలైన హాస్టల్ వెల్ఫేర్ ఫలితాల్లో గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన సునీత ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా బుధవారం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమలేశ్, నాయకులు నాయుడు, జయన్న, రాజేశ్, ఏసన్నతో కలిసి సునీత ఇంటికి వెళ్లి ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ తాలూకా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రభాకర్, వివిధ మండలాల యూత్ కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు.