News March 18, 2025

HYD: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న అమ్మాయికి Fits

image

ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని అస్వస్థతకు గురైంది. కీసర శ్రద్ధ కళాశాలలో ఎకనామిక్ పరీక్ష జరుగుతోంది. హాల్‌కు వచ్చిన విద్యార్థిని ప్రవళిక పరీక్ష రాస్తుండగా ఫిట్స్‌ రావడంతో కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి, ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాచారం ESIకి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ప్రవళిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Similar News

News March 18, 2025

ఈడీ వద్దకు చేరిన బెట్టింగ్ యాప్స్‌ కేసు

image

బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఈడీ ఆరా తీసింది. చెల్లింపుల వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకుంది. హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. 11 మంది వివరాలు సేకరించి.. ఎవరెవరికి ఎంత డబ్బులు ముట్టాయని ఈడీ ఆరా తీస్తోంది.

News March 18, 2025

సీఎంకి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యేలు

image

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య యాదవ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, ప్రకాశ్‌గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బలహీనవర్గాల హక్కుల కోసం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎంని ప్రశంసించారు.

News March 18, 2025

వృత్తిని ప్రేమించి.. బాధ్యతగా పని చేయండి: అజయ్ రావు

image

వృత్తిని ప్రేమించి బాధ్యతగా పని చేయాలని ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ అజయ్ రావు అన్నారు. ఎక్సైజ్‌ శాఖలో మహిళా కానిస్టేబుళ్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 129 మంది విధుల్లో చేరుతున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసి.. శిక్షణలో నైపుణ్యం కలిగిన వారికి ఆయన సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

error: Content is protected !!