News March 18, 2025

క్రిమినల్ కేసుల్లో టీడీపీ ఎమ్మెల్యేలదే అగ్రస్థానం: ADR

image

దేశంలో క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేల జాబితాలో టీడీపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. 134 మందికిగాను 115 మంది(86%)పై క్రిమినల్ కేసులు, 82 మంది(61%)పై తీవ్రమైన కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇక 1,653 మంది బీజేపీ ఎమ్మెల్యేలకుగాను 638 మంది(39%)పై కేసులు ఉన్నట్లు పేర్కొంది. 52 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల(339/646)పై, 41% TMC(95/230) ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయంది.

Similar News

News January 13, 2026

సంక్రాంతి వేళ 12 ప్రత్యేక రైళ్లు.. రిజర్వేషన్ అక్కర్లేదు!

image

AP: సంక్రాంతి పండుగ నేపథ్యంలో రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా విశాఖ-విజయవాడ మధ్య 12 జన్ సాధారణ్ ట్రైన్స్ నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనున్నట్టు తెలిపింది. జనవరి 12,13,14,16,17,18 తేదీలలో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

News January 13, 2026

ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

image

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.

News January 13, 2026

పిల్లలపై పోసిన భోగి పళ్లను తినవచ్చా?

image

భోగి పళ్లను దిష్టి తీయడానికి పోస్తారు కాబట్టి తినొద్దని కొందరు అనుకుంటారు. అయితే వీటిని తినొచ్చని పండితులు సూచిస్తున్నారు. బదరీ ఫలాలను సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావిస్తారు కాబట్టి తిన్నా ఏ దోషం ఉండదని అంటున్నారు. అయినప్పటికీ అనుమానం ఉన్నా, తినడానికి ఇష్టం లేకపోయినా కొన్ని పండ్లను విడిగా ముందే పక్కకు తీసి పెట్టుకోవాలి. రేగుపళ్లలో సి-విటమిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.