News March 18, 2025

నాటు సారాలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

మన రాష్ట్రాన్ని నాటు సారాలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. మంగళవారం తిరువూరులో నాటు సారా నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సారా నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాటు సారా తయారీదారులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ కల్పన కల్పిస్తామని అన్నారు. చదువులేని వారికి ఎంచుకున్న ఉపాధి తప్పనిసరిగా అందిస్తామని పేర్కొన్నారు.

Similar News

News March 19, 2025

రూ.3,04,965 కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన Dy.CM

image

తెలంగాణ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లబడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.12571 కోట్లు, రైతు భరోసాకు రూ.18 వేలకోట్లు, విద్యాశాఖ రూ.23108 కోట్లు కళ్యాణ లక్ష్మీ రూ.3683, వైద్యారోగ్యశాఖకు రూ.23108 కోట్లు, గృహజ్యోతి రూ.2080 కోట్లు, రైతు బీమా రూ.1539 కోట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు.

News March 19, 2025

పరీక్షలకంటే అంత ఇంపార్టెంట్ ఇంకేముంది?

image

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. అయితే, ఏడాదంతా కాలేజీలకు వెళ్లిన వేలాది స్టూడెంట్స్ పరీక్షలకు గైర్హాజరవుతున్నారు. తొలి పరీక్షను ఏకంగా 17వేల మంది రాయలేదు. నిన్న ఫిజిక్స్ & ఎకనామిక్స్ పరీక్షలు జరగ్గా 13,403 మంది డుమ్మా కొట్టారు. పరీక్షలకంటే అంత ఇంపార్టెంట్ ఇంకేముంటుంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాను రాను విద్యార్థులు చదువును మరింత నెగ్లెక్ట్ చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.

News March 19, 2025

NGKL: 26వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

image

శ్రీశైలం ఎడమ గట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. 26వ రోజు బుధవారం మరోసారి క్యాడవర్ డాగ్స్ బృందం సహాయక చర్యల్లో పాల్గొనేందుకు టన్నెల్‌లోకి వెళ్లారు. రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతం చేశారు. జిల్లా కలెక్టర్ భాగవత్ సంతోష్ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏడుగురి ఆచూకీ కనుగొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

error: Content is protected !!