News March 24, 2024

లోక్‌సభ ఎన్నికల్లో వీరప్పన్ కూతురు పోటీ

image

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి నామ్ తమిళర్ కట్చి పార్టీ తరఫున ఆమె బరిలోకి దిగనున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె జులై 2020లో BJPలో చేరారు. రాష్ట్ర యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇటీవలే ఆ పార్టీని వీడి NTKలో చేరడంతో ఆ పార్టీ ఆమెకు ఎంపీ టికెట్‌ను కేటాయించింది.

Similar News

News February 4, 2026

7న ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్

image

ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ తదితర యాప్ ఆధారిత రవాణా కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేశాయి. అగ్రిగేటర్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఛార్జీలను నిర్ణయించడాన్ని నిరసిస్తూ ఈ నెల 7న ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్ చేపడుతున్నట్లు వెల్లడించాయి. కంపెనీల తీరుతో డ్రైవర్లు ఆదాయం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి. ధరలపై నియంత్రణ లేకపోవడంతో ప్రయాణికులూ ఇబ్బందులు పడుతున్నారన్నాయి.

News February 4, 2026

రుతుక్రమంపై ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులు

image

వాతావరణమార్పులతో రుతుక్రమం ప్రభావితం అవుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. బంగ్లాదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు 1992-93, 2019-21 సంవత్సరాల్లో జనాభా, ఆరోగ్య సర్వేలు, నాసా వాతావరణ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో శారీరక ఒత్తిడి పెరిగి హర్మోన్లను నియంత్రిస్తోంది. తద్వారా ఉష్ణప్రాంతాల్లోని బాలికల్లో రుతుక్రమం ఆలస్యమవుతున్నట్లు గుర్తించారు.

News February 4, 2026

‘వారణాసి’ సీక్వెల్‌పై రాజమౌళి క్లారిటీ!

image

‘వారణాసి’ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, సుమారు 3 గంటల నిడివితో సింగిల్ పార్ట్‌గానే వస్తుందని స్పష్టం చేశారు. రామాయణంలోని ఓ భాగాన్ని ఇందులో చూపించనున్నట్లు తెలిపారు. మహేశ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృథ్వీరాజ్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్, వచ్చే ఏడాది APR 7న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది.