News March 18, 2025

ఏప్రిల్ 15 తర్వాత ‘అమరావతి’ పనులు

image

AP: వచ్చే నెల 15 తర్వాత రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలిక సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో తొలుత పనులు మొదలుపెట్టనుంది. అక్కడే ప్రధాని మోదీతో సభను నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. కాగా ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు ప్రధానిని ఆహ్వానించనున్నారు.

Similar News

News November 6, 2025

225 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

TGలో జిల్లా కోఆపరేటివ్​ బ్యాంకుల్లో(DCCB) 225 స్టాఫ్​ అసిస్టెంట్​ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ పాసై, 18- 30ఏళ్ల వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. HYD​, కరీంనగర్, ఖమ్మం, MBNR​, మెదక్​, WGL​ జిల్లాల్లో ఖాళీలున్నాయి. ఆన్‌లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి

News November 6, 2025

యుగయుగాలకు ఆదర్శం ‘శ్రీరాముడి పాలన’

image

సత్య యుగంలో అంతా మంచే ఉన్నా, త్రేతా యుగంలోని రామ రాజ్యమే చరిత్రలో నిలిచింది. దీనికి కారణం శ్రీరాముని గొప్ప గుణాలు, ఆదర్శవంతమైన పాలన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చూపిన రాజధర్మం సుపరిపాలనకు చిరునామాగా నిలిచింది. ఒక గొప్ప వ్యక్తి రాజుగా ఉంటే, రాజ్యం ఎంతటి ఉన్నత శిఖరాలను చేరుతుందో రామరాజ్యం రుజువు చేసింది. అందుకే, యుగాల తరబడి ఆ పాలనను ఆదర్శంగా చెప్పుకుంటారు. ‘రామరాజ్యం’ అని పోల్చుతుంటారు.

News November 6, 2025

ఈ పంటలకు నారు పెంచి ప్రధాన పొలంలో నాటుకోవాలి

image

తీగజాతి కూరగాయలు అయినటువంటి చిక్కుడు, ఫ్రెంచ్ చిక్కుడు, బెండ, గోరు చిక్కుడు, మునగ లాంటి కూరగాయ పంటలలో విత్తన పరిమాణం పెద్దదిగా ఉంటుంది. కాబట్టి వీటిని నారుగా కాకుండా విత్తనాలను నేరుగా పొలంలోనే విత్తుకోవచ్చు. టమాట, వంగ, క్యాబేజి, కాలిఫ్లవర్, మిరప, ఉల్లి లాంటి పంటలలో విత్తన పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. అందుకే వీటిని ముందుగా నారుమడులలో పెంచుకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నారును నాటుకోవాల్సి ఉంటుంది.