News March 18, 2025

సైబర్‌ నేరాల దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యమే కీలకం: ఎస్పీ

image

సైబర్‌ నేరాల దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యమే కీలకమని జిల్లా ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని పోలీసు అధికారులకు సైబర్, ఇతర నేరాలలో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌పై వర్క్ షాప్ నిర్వహించారు. హైదరాబాద్ నుండీ వచ్చిన సైబర్ ఎక్స్పర్ట్ రామాంజినేయులచే సైబర్ నేరాల శోధనలో పాటించాల్సిన మెళకువలపై అవగాహన కల్పించారు. కేసు ఛేదనలో ప్రతీ అంశాన్ని కీలకంగా తీసుకోవాలన్నారు.

Similar News

News August 10, 2025

రాగులపాడు పంప్ హౌస్‌లో 10 మోటార్లతో నీటి పంపింగ్

image

వజ్రకరూరు మండలం రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 10 మోటార్ల ద్వారా శనివారం నీటిని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలోకి పంపింగ్ చేశారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి రాగులపాడు పంప్ హౌస్ నుంచి 10 మోటార్లతో నీటి పంపింగ్ చేసేలా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబుకు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలిపారు. హంద్రీనీవా కాలువలో పుష్కలంగా నీరు వస్తోందని, ఇందుకు చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు.

News August 9, 2025

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ నంబర్లకు ఫోన్ చేయండి: ఎస్పీ

image

ఎక్కడైనా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే డయల్ 100/112 లేదా సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. అనంతపురం జిల్లాలోని వాహనదారులు అధిక శబ్దంతో కూడిన స్పీకర్లు, సైలెన్సర్లు ఉపయోగించి అధిక వేగంగా వెళ్లరాదన్నారు. బైక్‌పై త్రిబుల్ రైడింగ్ చేయరాదని, ఆటోలో పరిమితికి మించి ప్రయాణీకులను తీసుకెళ్లరాదన్నారు. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడరాదన్నారు.

News August 9, 2025

అనంత జిల్లాలో 746 కేసులు నమోదు

image

అనంతపురం జిల్లాలో 76 ఓపెన్ డ్రింకింగ్, 44 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై 626 ఎంవీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. రూ.2,27,046 జరిమానాలు విధించామన్నారు. 42 పోలీసు స్టేషన్ల పరిధిలో అక్కడి పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌ నిర్వహించి, వాహనాల తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.