News March 18, 2025
చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.50,000: సీఎం

AP: చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని CM చంద్రబాబు తెలిపారు. దీంతో 93వేల మంది చేనేతకారులకు, 10,534 మరమగ్గాల యజమానులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి ₹50,000 సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే వారికి GST రీయింబర్స్మెంట్ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ సహకారంతో నేతన్నలు వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.
Similar News
News February 15, 2026
ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో ఈ నెల 17వ తేదీ రింగ్ ఆఫ్ ఫైర్గా పిలిచే వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. 3.26pm-7.57pm వరకు గ్రహణం ఉంటుంది. అయితే భారతదేశం నుంచి దీన్ని వీక్షించే అవకాశం లేదు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటార్కిటికా ఖండం నుంచి స్పష్టంగా కన్పిస్తుంది. సాధారణంగా సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ టైమ్లో చంద్రుడు సైజు చిన్నగా కనిపించడంతో సూర్యుడి అంచులు రింగ్లా దర్శనమిస్తాయి.
News February 15, 2026
పవర్ ప్లేలో భారత్ స్కోర్ 52-1

T20WC: తొలి ఓవర్లోనే అభిషేక్ ఔటైనా ఇషాన్ కిషన్(42*) ధనాధన్ ఆటతో భారత్ పవర్ ప్లే ముగిసే వరకు 52 పరుగులు చేసింది. అటు తిలక్ వర్మ(10*) ఆచితూచి ఆడుతున్నారు. తొలి 6 ఓవర్లలో 5 ఓవర్లను పాక్ స్పిన్నర్లతోనే వేయించడం విశేషం.
News February 15, 2026
మహా శివరాత్రి జాగరణ చేస్తున్నారా?

ఇవాళ మహాశివరాత్రి జాగరణ మనలోని శివత్వాన్ని మేల్కొలుపుతుందని పండితులు చెబుతున్నారు. ఇవాళ రాత్రంతా జాగరణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుందంటున్నారు. అయితే సినిమాలు చూస్తూ, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ, డాన్సులు చేసేది జాగరణ కాదని స్పష్టం చేస్తున్నారు. కునికిపాట్లు పడకుండా శివ నామాలను భక్తితో స్మరించాలని సూచిస్తున్నారు. అర్ధరాత్రి 12.03 గంటల నుంచి 12.53 వరకు లింగోద్భవ కాలంలో పూజలు, అభిషేకం చేయాలంటున్నారు.


