News March 18, 2025

తల్లి, సోదరుడి శవాలతో నెల రోజులుగా ఇంట్లోనే..

image

AP: తల్లి, సోదరుడి మృతదేహాలతో ఓ వ్యక్తి నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కడప శాటిలైట్ సిటీలో నివాసముంటున్న వృద్ధురాలికి ఇద్దరు కొడుకులు(45,55 ఏళ్లు) ఉన్నారు. నెల కిందట ఆమె చనిపోగా, ఓ కొడుకు ఉరేసుకున్నాడు. ఈ ఇద్దరు కుమారులు ఎవరితో మాట్లాడేవారు కాదు. దీంతో ఆ ఇంటి నుంచి దుర్వాసన వచ్చే దాకా విషయం బయటకు రాలేదు. స్థానికులు మానసిక స్థితి లేని మరో కుమారుడిని ఆశ్రమానికి తరలించారు.

Similar News

News March 19, 2025

ఇండియాలో 6 అడుగుల ఎత్తున్న వారు ఎందరంటే?

image

‘ఆరడుగుల అందగాడు’ అని చెప్తూ ఎత్తును ఎందుకు కన్సిడర్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మన దేశంలో 6 ఫీట్ కటౌట్ కలిగిన వ్యక్తులు చాలా తక్కువ. ఇండియాలో 1శాతం మంది మాత్రమే 6 లేదా అంతకంటే ఎక్కువ ఎత్తును కలిగి ఉన్నారు. భారతీయ మగవారి సగటు ఎత్తు 5.5 అడుగులు (164.94 సెం.మీ) కాగా ఆడవారి సగటు ఎత్తు 5 అడుగులు. అలాగే USAలో 14.5% మంది పురుషులు ఆరు అడుగుల కంటే ఎత్తు ఉన్నారు. మీ హైట్ ఎంత? COMMENT

News March 19, 2025

దేశంలోనే అత్యంత ధనిక MLA ఇతనే

image

దేశంలోని 4,092 MLAల ఆస్తులపై ఏడీఆర్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్ శాసనసభ్యుడు పరాగ్ షా(BJP) దేశంలోనే ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. రూ.3,400 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రూ.1,413 కోట్లతో కర్ణాటక Dy.CM DK శివకుమార్(INC) రెండో స్థానంలో నిలిచారు. రూ.1,700తో దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌లోని ఇండస్ శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ ధారా(BJP) నిలిచారు.

News March 19, 2025

ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 25, 26 తేదీల్లో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, పీ4 విధానంపై చర్చించనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్, అర్హులకు పథకాల అందజేత, ఇతర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

error: Content is protected !!