News March 18, 2025
కాకినాడ: పవన్ కళ్యాణ్తో ఎమ్మెల్సీ తోట..హాట్ టాపిక్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలయిక మంగళవారం చోటుచేసుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా జరిగిన ఫోటోస్ స్టేషన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ త్రిమూర్తులు ఒకరికొకరు తారసపడ్డారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తోట త్రిమూర్తులను పలకరించారు. ఇప్పటికే పెండెం దొరబాబు జనసేనలో చేరారు.
Similar News
News March 19, 2025
ధర్మారంలో ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు

ధర్మారం మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినందుకు గానూ సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్ అనే ఆసుపత్రిని అధికారులు మంగళవారం రోజున సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ప్రసన్న కుమారి, వైద్య సిబ్బంది, పోలీసులు ఉన్నారు.
News March 19, 2025
CM తిరుపతి పర్యటన షెడ్యూల్ ఇదే..!

తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు రెండు రోజులు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి 8:35 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9:25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గాన తిరుమలకు బయల్దేరుతారు. రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్కు వెళ్తారు.
News March 19, 2025
నాగర్కర్నూల్ జిల్లాకు ఎల్లో WARNING

నాగర్కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ శాఖ మంగళవారం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను నమోదయ్యాయని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది. రాబోయే రెండు, మూడు రోజుల వరకు జిల్లాలో సుమారు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.