News March 18, 2025

ఏప్రిల్ మూడో వారంలోగా రీ సర్వే పూర్తి: నెల్లూరు జేసీ

image

జిల్లాలో ఎంపిక చేసిన 35 గ్రామాలలో ఏప్రిల్ మూడో వారంలోగా రీసర్వే పూర్తి చేస్తామని జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. మండలంలోని పిడూరు గ్రామంలో జరుగుతున్న రీ సర్వేని ఆయన మంగళవారం పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందజేశారు. నోషనల్ ఖాతాలు లేకుండా చూడాలన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 35 గ్రామాలను రీ సర్వే చేయడానికి పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేశామన్నారు.

Similar News

News September 18, 2025

నెల్లూరు: గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన నెల్లూరు-వేదాయపాలెం రైల్వే స్టేషన్ మధ్య బుధవారం జరిగింది. విజయవాడ-చెన్నై మార్గంలో రైలు పట్టాలపై డెడ్ బాడీ దొరికింది. డోర్ వద్ద కూర్చొని రైలు నుంచి జారిపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుంది. మెరూన్ రంగు ఆఫ్ టీషర్ట్, బ్లూ రంగు షార్ట్ ధరించాడు. ఎస్సై హరి చందన కేసు నమోదు చేశారు.

News September 18, 2025

NLR: ఒక్క ప్రమాదం.. 4కుటుంబాల్లో విషాదం

image

సంగం(M) పెరమన ఘోర <<17737459>>ప్రమాదం <<>>పలువురిని రోడ్డున పడేసింది. ఇందుకూరుపేటకు చెందిన భార్యాభర్త శ్రీనివాసులు, లక్ష్మి చనిపోగా వీరి పిల్లలు(9, 6th క్లాస్) అనాథలయ్యారు. శ్రీనివాసులు, రాధ(నెల్లూరు) నిన్న మృతిచెందగా రెండేళ్ల కిందటే వీళ్ల కుమార్తె ఉరేసుకుంది. కుమారుడు శ్యాం అనాథయ్యాడు. శ్రీనివాసులు హోటల్లో పనిచేసే బ్రహ్మయ్య కారు డ్రైవర్‌గా వచ్చి చనిపోగా.. ఇదే ఘటనలో శారమ్మ, బాల వెంగయ్య(వదిన, మరిది) కన్నుమూశారు.

News September 17, 2025

NLR: బాలికతో అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

image

ఉదయగిరికి చెందిన ఓ మహిళ భర్త ఏడాది క్రితం చనిపోయాడు. ఆమెకు కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉంది. నెల్లూరు BVనగర్‌కు చెందిన వెంకటేశ్‌తో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. పిల్లలను బాగా చూసుకుంటానని అతను నమ్మించి కొండాయపాలెంలో ఇంటిని తీసుకున్నాడు. గత నెల 30న కుమార్తెతో కలిసి మహిళ ఈ ఇంటికి వచ్చింది. ఆమె బయటకు వెళ్లిన సమయంలో బాలికతో వెంకటేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. పోక్సో కేసు నమోదైంది.