News March 24, 2024

టీవీల్లోకి ‘గుంటూరు కారం’.. ఎప్పుడంటే?

image

హీరో మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమా టీవీల్లోకి రాబోతోంది. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ ఉగాది పర్వదినం సందర్భంగా బుల్లితెరపైకి రానుంది. ఏప్రిల్ 9న జెమినీ టీవీలో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యే అవకాశముంది. ఈ మేరకు జెమినీ ఓ ప్రోమోను విడుదల చేసింది. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం సుమారు రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Similar News

News September 15, 2025

సమ్మె విరమించమని కోరాం: భట్టి

image

TG: ప్రైవేటు కళాశాలలు <<17708995>>బందు<<>>కు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాజమాన్యాలతో Dy.CM భట్టి విక్రమార్క అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ‘చర్చలు సానుకూలంగా సాగాయి. సమస్యలు అర్థం చేసుకున్నాం. సోమవారం ప్రభుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు’ అని తెలిపారు. బంద్ నిర్ణయంలో కళాశాలలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. ఇవాళ మ.3 గం.కు మరోసారి చర్చలు జరగనున్నాయి.

News September 15, 2025

ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా?

image

సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ‘ఇండియా పోస్ట్’ పేరిట ఫేక్ మెసేజులు పంపుతున్నారు. ‘మీ పార్సిల్ వేర్ హౌస్‌కి చేరుకుంది. అడ్రస్ సరిగ్గా లేకపోవడంతో డెలివరీ కుదర్లేదు. ఈ లింక్ ఓపెన్ చేసి 48 గంటల్లోగా అడ్రస్ అప్‌డేట్ చేయండి. లేదంటే పార్సిల్ రిటన్ వెళ్లిపోతుంది’ అని మెసేజ్‌లు పంపుతున్నారు. అవన్నీ ఫేక్ అని PIB FACT CHECK తేల్చింది. మీ వాళ్లకి ఈ విషయం షేర్ చేయండి.

News September 15, 2025

చలికాలం మరింత చల్లగా ఉండనుంది: నిపుణులు

image

అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లా నినా వల్ల చలి తీవ్రంగా ఉంటుంది అంటున్నారు. ఎల్‌ నినో దక్షిణ ఆసిలేషన్ సైకిల్‌లో శీతల దశైన లా నినా.. భూమధ్య రేఖ పసిఫిక్‌లో సముద్ర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది అంటున్నారు. దాంతో వాతావరణంపై ప్రభావం ఉండనుంది. భారత్‌లో గతంలో కంటే చలి అధికంగా ఉంటుందని చెబుతున్నారు. తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.