News March 18, 2025
రన్యారావు కేసులో వెలుగులోకి కీలక విషయాలు

బంగారం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తన స్నేహితుడు తరుణ్ రాజుతో 26 సార్లు దుబాయ్ వెళ్లినట్లు, ఆ సమయంలోనూ స్మగ్లింగ్ చేసినట్లు DRI కోర్టు విచారణలో పేర్కొంది. ఆ సమయంలో వీరిద్దరూ ఉదయం బయలుదేరి సాయంత్రం తిరిగొచ్చేవారంది. దుబాయ్లో రాజు ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు, అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వివరించింది.
Similar News
News January 4, 2026
ఇలా చేస్తే ఐదు నిమిషాల్లోనే నిద్ర పోతారు

పని ఒత్తిడి, మానసిక ఆందోళనలతో చాలామంది నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేయడం వలన మెదడు ప్రశాంతమవుతుంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలోకి వస్తుంది. నిద్రలో మేల్కొనే సమస్య ఉన్నవారికి సైతం ఈ టెక్నిక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ పడుకునే ముందు 5 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.
News January 4, 2026
రేపు బీఆర్ఎస్ PPT

TG: కృష్ణా జలాలపై ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో నిర్వహించిన చర్చకు కౌంటర్గా బీఆర్ఎస్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ పేరిట PPT ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కాగా రాష్ట్ర ఏర్పాటు సమయంలో నీటి కేటాయింపుల్లో కేసీఆర్, హరీశ్ రావు రాష్ట్రానికి అన్యాయం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు.
News January 3, 2026
వెనిజులాపై అమెరికా ఎందుకు దాడి చేసింది?

వెనిజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని <<18751661>>అదుపులోకి<<>> తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశంపై దాడికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మదురో పాలనతో ఆర్థిక సంక్షోభం ఏర్పడి భారీగా USకు వలసలు పెరిగాయి. అదే విధంగా వెనిజులా చమురు నిల్వలపై అమెరికా ఆసక్తి చూపిస్తోంది. దీంతో పాటు డ్రగ్స్ అక్రమ రవాణా అంశం కూడా ట్రంప్ కఠిన చర్యలకు దారి తీశాయని విశ్లేషకుల అభిప్రాయం.


