News March 19, 2025

తూ.గో. జిల్లాలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

image

AP: తూ.గో. జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ, వన్యప్రాణి సంరక్షణపై అటవీ శాఖ ఉద్యోగులు లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణ అక్కడ ఉండాలని Dy.CM పవన్ అన్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా తాజాగా దివాన్ చెరువు ప్రాంతంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.

Similar News

News March 19, 2025

10,000 మంది ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్స్

image

ప్రముఖ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 10,000మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్‌లోనే దాదాపు 18వేల మందికి లేఆఫ్స్ ఇచ్చిన అమెజాన్ ఇప్పుడు మరోసారి ఉద్యోగాలకు కోత విధించనుంది. దీనిని పలువురు టెక్ నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. AI టెక్నాలజీ రావడంతో పలు ఐటీ సంస్థలు భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

News March 19, 2025

ఫోన్ ట్యాపింగ్.. వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై CBI నుంచి రాష్ట్ర సీఐడీకి సమాచారం వచ్చింది. వారిద్దరినీ వీలైనంత త్వరగా మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.

News March 19, 2025

BYD సంచలనం.. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 470 కి.మీ

image

చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ BYD సంచలనం సృష్టించింది. కేవలం 5-8 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే కారు దాదాపు 470 కి.మీ వెళ్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. చైనావ్యాప్తంగా 4వేల అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించబోతున్నామని తెలిపింది. దీంతో టెస్లా, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలకు గట్టి సవాల్ ఎదురుకానుంది.

error: Content is protected !!