News March 19, 2025
TODAY HEADLINES

TG: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
TG: ఇందిరమ్మ ఇళ్లు.. వారికి తొలి ప్రాధాన్యత: సీఎం రేవంత్
AP: చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.50,000: CM
AP: 50 ఏళ్లకే పెన్షన్పై మంత్రి కీలక ప్రకటన
☛ కుంభమేళా దేశ ప్రజల విజయం: PM మోదీ
☛ మే 20న దేశవ్యాప్త సమ్మె: కార్మిక సంఘాలు
☛ ISS నుంచి భూమిపైకి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం
Similar News
News March 20, 2025
ఫ్రీ బస్సు స్కీమ్ ఉండాలా? వద్దా?

APలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని అమలు చేయవద్దని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. తెలంగాణలో ఈ స్కీమ్ వల్ల వస్తోన్న ఇబ్బందులను చూస్తున్నామని, ఉచిత పథకాలను ప్రోత్సహించవద్దని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేవలం జిల్లా పరిధిలోనే ఫ్రీ బస్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. బస్సుల సంఖ్యనూ పెంచుతోంది. దీనిపై మీ కామెంట్?
News March 20, 2025
IPL: ముంబైకి షాక్

IPL: ఆదివారం CSKతో జరిగే తొలి మ్యాచులో ముంబై ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగనుంది. బుమ్రా గాయం ఇంకా తగ్గలేదని, కోలుకునేందుకు మరింత సమయం పట్టవచ్చని కోచ్ జయవర్ధనే క్లారిటీ ఇచ్చారు. నిషేధం కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్య సైతం ఫస్ట్ మ్యాచుకు దూరమయ్యారు. అతడి స్థానంలో సూర్య కెప్టెన్సీ చేయనున్నారు. గత కొన్ని సీజన్లుగా ఫస్ట్ మ్యాచ్ ఓడుతూ వస్తోన్న MI.. ఈ స్టార్లు లేకుండా ఎలా ఆడుతుందో మరి!
News March 20, 2025
నేను బీఆర్ఎస్లోనే ఉన్నా: ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే

TG: తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యత్వ రుసుము రూ.5వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే పార్టీ మారినట్లు ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. తనను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చెల్లుబాటు కాదని పేర్కొన్నారు.