News March 19, 2025

ఆన్‌లైన్‌ బెట్టింగ్లపై పటిష్ఠ నిఘా: ASF ఎస్పీ

image

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్‌లకు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. మోసపూరితమైన సందేశాలను నమ్మి ఇతరులకు తమ వివరాలు ఇవ్వరాదని జిల్లా ప్రజలకు తెలిపారు. ఆన్‌లైన్‌లో డబ్బులు ఎక్కువ ఇస్తామని ఎవరైనా చెప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు.

Similar News

News November 24, 2025

జనగామ: రేపు కలెక్టరేట్‌లో దిశా కమిటీ సమావేశం

image

జనగామ కలెక్టరేట్లో మంగళవారం దిశా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని వసంత తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కావున ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, దిశా కమిటీ మెంబర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News November 24, 2025

తిరుపతిలో మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు

image

తిరుపతి నగరంలోని తిలక్ రోడ్డులో ఉదయాన్నే మద్యం విక్రయిస్తున్నారు. ఇదే విషయమై Way2Newsలో ఆదివారం <<18364526>>‘పొద్దుపొద్దున్నే.. ఇచ్చట మద్యం అమ్మబడును..?’ <<>>అంటూ వార్త ప్రచురితమైంది. ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించారు. వైన్ షాప్ పక్కనే మద్యం విక్రయిస్తున్న సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 6మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎక్సైజ్ సీఐ రామచంద్ర వెల్లడించారు.

News November 24, 2025

ADB: మనకే పదవి వస్తుందనుకున్నాం.. కానీ

image

డీసీసీ అధ్యక్షుల ఎంపికతో కాంగ్రెస్‌లో సీనియర్లు నిరాశకు లోనయ్యారు. తమకే పదవి వస్తుందని జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్దామని భావించారు. జిల్లాలో గోక గణేశ్ రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గండ్రత్ సుజాత, ఆడే గజేందర్ వంటివారు అధ్యక్ష పీఠంపై కన్ను వేశారు. కానీ అధిష్టానం వారిని కాదని నరేశ్ జాదవ్‌కు బాధ్యతలు అప్పగించింది. దీంతో పదవి ఆశించిన నేతలు, వారి అభిమానులు నిరాశలో ఉన్నారు.