News March 19, 2025

గద్వాల: జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం సమీక్ష

image

ప్రఖ్యాత జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం సమీక్ష నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో జరిగిన ఈ భేటీలో జోగులాంబ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికపై చిన్నారెడ్డి, అజయ్ కల్లం చర్చించారు.

Similar News

News September 17, 2025

చిత్తూరు: ప్రియురాలి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య

image

చిత్తూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తవణంపల్లె మండలం దిగువమారేడుపల్లికి చెందిన దేవరాజులు(40) భార్య, పిల్లలను వదిలేసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 9ఏళ్లుగా గంగన్నపల్లికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఏమైందో ఏమో మంగళవారం సాయంత్రం ఆమె ఇంట్లోనే అతను ఉరేసుకున్నాడు. మొదటి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ నెట్టికంటయ్య తెలిపారు.

News September 17, 2025

రూ.15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే అప్లికేషన్లు

image

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అర్హులైన వారు నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రత్యేక <<17731468>>ఫామ్‌లో<<>> వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలి. ఎంపికైన డ్రైవర్ల అకౌంట్లలో అక్టోబర్‌ 1న ప్రభుత్వం నగదు జమ చేయనుంది.

News September 17, 2025

నంద్యాల: వేధింపులతో భార్య మృతి.. భర్తకు 7ఏళ్ల జైలు శిక్ష

image

భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ, ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన భర్త కనకం కృష్ణయ్యకు నంద్యాల కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లికి చెందిన రాజేశ్వరిని భర్త కనకం కృష్ణయ్య అదనపు కట్నం కోసం వేధించారు. మనస్తాపానికి గురైన ఆమె 2022లో విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.