News March 19, 2025
PPM: ‘గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి’

పార్వతీపురం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం గృహ నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక, మండలస్థాయి తదితర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్రా 2047 విజన్లో భాగంగా 2029 నాటికి అందరికీ సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
Similar News
News September 15, 2025
కృష్ణ: 100 ఏళ్ల నాటి నిజాం కాలం వంతెన

నిజాం కాలంలో నిర్మించిన పురాతన రాతి వంతెన వందేళ్లు గడిచినా ఇప్పటికీ చెక్కుచెదరలేదు. గచ్చుతో నిర్మించిన ఈ వంతెన భారీ వరదలు ముంచెత్తిన చిన్న మరమ్మతు కూడా అవసరం రాలేదు. NRPT జిల్లా కృష్ణ మండలం వాసునగర్- శక్తి నగర్ మధ్య ఈ వంతెన నిర్మించారు. నిర్మాణ శైలి అర్ధ చంద్రాకారంలో ఉండే 18 ఖానాల (వెంట్)తో ఈ వంతెన నిర్మించారు. ఖానా మధ్యలోని రాయి భారం మోస్తుందని ఇంజినీరింగ్ల అభిప్రాయం. నేడు ఇంజినీర్ల దినోత్సవం.
News September 15, 2025
కిమ్ ఆగడాలు.. మూవీస్ షేర్ చేస్తే చంపేశారు!

నార్త్ కొరియాపై యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన 14 పేజీల రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశం విడిచి పారిపోయిన 300 మంది ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఆ నివేదిక తయారు చేశారు. ‘2015లో తీసుకొచ్చిన చట్టాలు, పాలసీలతో పౌరులపై సర్వేలైన్స్, అన్ని విధాలుగా వారి జీవితాలపై ఆధిపత్యం పెరిగింది. ఆఖరికి ఫారిన్ మూవీస్, K-డ్రామాలు షేర్ చేసుకున్నారని ఎంతో మందిని చంపేశారు’ అని నివేదికలో ఉంది.
News September 15, 2025
మైథాలజీ క్విజ్ – 6

1. వ్యాస భాగవతంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
2. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసిన అడవి పేరేంటి?
3. కంసుడు పరిపాలించిన రాజ్యం?
4. మొధెరా సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. శ్రావణ మాసం పౌర్ణమి నాడు వచ్చే పండగ ఏది? (సరైన సమాధానాలను కామెంట్ చేయండి. జవాబులను రేపు 7AM పబ్లిష్ చేస్తాం.)
<<17696624>>మైథాలజీ క్విజ్ – 5<<>> ఆన్సర్స్: 1.భూమి, ఆకాశం 2.త్రయంబకేశ్వర ఆలయం 3.మాఘ మాసం 4.భీష్ముడు 5.సీత