News March 19, 2025

గద్వాల జిల్లా ప్రజలకు ఆర్టీసీ శుభవార్త 

image

గద్వాల్ జిల్లా ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ గద్వాల్ డిపో అధికారులు శుభవార్త తెలిపారు. డిపో లాజిస్టిక్స్ సేవల ద్వారా గద్వాల్ జిల్లా ప్రజలు ఇంటికే భద్రాద్రి సీతారాములవారి తలంబ్రాలను పొందవచ్చని కార్గో ఏటీఎం ఇసాక్ తెలిపారు. కార్గో టీమ్‌కు రూ.151 చెల్లించి బుకింగ్ రశీదు పొందాలన్నారు. అనంతరం సీతా రాముల కళ్యాణ తలంబ్రాలను మీ ఇంటి వద్దకు చేర్చుతారని, వివరాలకు పృథ్వీరాజ్ 9154298609 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News November 5, 2025

IIM షిల్లాంగ్‌లో ఉద్యోగాలు

image

<>IIM<<>> షిల్లాంగ్ ప్రొఫెసర్, Asst ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో PhDతో పాటు పని అనుభవం గలవారు NOV 22 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్స్& పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్&కంట్రోల్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్& అనాలసిస్, మార్కెటింగ్, ఆపరేషన్స్ &క్వాంటిటేటివ్ టెక్నిక్స్, HR, స్ట్రాటజీ& లిబరల్ స్టడీస్ విభాగంలో ఖాళీలున్నాయి. వెబ్‌సైట్: iimshillong.ac.in

News November 5, 2025

లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా

image

20 అంశాల కార్యక్రమ అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆయన బుధవారం జిల్లాలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, సాయంత్రం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అనివార్య కారణాలవల్ల ఈ పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 5, 2025

వనపర్తి: జిల్లా వ్యాప్తంగా 1,61,314 రేషన్ సంచులు పంపిణీ

image

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 327 రేషన్ దుకాణాలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 1,61,314 సంచులను సరఫరా చేసింది. ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి కాటన్ సంచులను సరఫరా చేయడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆన్‌లైన్‌లో వేలిముద్ర వేసి బియ్యాన్ని తీసుకున్న వారికి మాత్రమే సంచులను సరఫరా చేయనున్నట్లు అధికారులు, రేషన్ డీలర్లు తెలియజేశారు.