News March 19, 2025
HNK: విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 19న బహిరంగ విచారణ

విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 19న బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు టిజి ఎన్.పి.డీ.సి.ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో జరిగే ఈ బహిరంగ విచారణలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సవరణ చేయబడిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడి సర్ఛార్జ్ల ప్రతిపాదనలపై విచారణ జరుగుతుందన్నారు.
Similar News
News March 19, 2025
IPLలో పర్పుల్ క్యాప్ హోల్డర్స్

*2008- సోహైల్ తన్వీర్ *2009- ఆర్పీ సింగ్
*2010- ప్రజ్ఞాన్ ఓఝా *2011- లసిత్ మలింగ
*2012- మోర్నే మోర్కెల్ *2013- డ్వేన్ బ్రావో
*2014- మోహిత్ శర్మ *2015- డ్వేన్ బ్రావో
*2016, 17- భువనేశ్వర్ కుమార్ *2018- ఆండ్రూ టై
*2019- ఇమ్రాన్ తాహిర్ *2020- కగిసో రబాడ
*2021- హర్షల్ పటేల్ *2022- యుజువేంద్ర చాహల్
*2023- మహమ్మద్ షమీ *2024- హర్షల్ పటేల్
*2025- ?
News March 19, 2025
కొల్లేరు సరిహద్దులు గుర్తింపు.. వారందరిలో ఆందోళన

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు సరిహద్దులను గుర్తించే ప్రక్రియను అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఉంటున్న వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఈ సర్వే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సర్వే పూర్తయి నివేదిక పరిశీలించిన తర్వాత సుప్రీం ఏం చేయబోతుందన్నదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
News March 19, 2025
ఎస్.అన్నవరం: రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి

తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన వైసీపీ నేత కుసనం దొరబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున తుని రైల్వే స్టేషన్ నుంచి ద్విచక్రవాహనంపై ఆయన స్వగ్రామం ఎస్.అన్నవరం వెళుతుండగా కుక్కలు అడ్డురావడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. ఆయన భార్య ఎస్.అన్నవరంలో ఓ సెగ్మెంట్కి ప్రస్తుతం ఎంపీటీసీగా ఉన్నారు.