News March 19, 2025

రక్తదానం చేసిన హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య

image

తలసేమియా వ్యాధిగ్రస్తులకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సుబేదారిలోని రెడ్ క్రాస్ రక్తనిధిలో రక్తదాన కార్యక్రమాన్ని హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఈ శిబిరం యువతలో స్ఫూర్తి కలిగించేందుకు హన్మకొండ కలెక్టర్ స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం రక్త దానం చేసిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, పండ్లను అందజేశారు.

Similar News

News March 19, 2025

ఎస్.అన్నవరం: రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి

image

తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన వైసీపీ నేత కుసనం దొరబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున తుని రైల్వే స్టేషన్ నుంచి ద్విచక్రవాహనంపై ఆయన స్వగ్రామం ఎస్.అన్నవరం వెళుతుండగా కుక్కలు అడ్డురావడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. ఆయన భార్య ఎస్.అన్నవరంలో ఓ సెగ్మెంట్‌కి ప్రస్తుతం ఎంపీటీసీగా ఉన్నారు.

News March 19, 2025

జగిత్యాల: వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న నలుగురు వివిధ ఘటనల్లో చనిపోయారు. JGTLరూరల్(M) వెల్దుర్తికి చెందిన రాజం(55) అనే <<15808621>>రైతు<<>> అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో గంగాధర(M) ఉప్పరమల్యాలకు చెందిన మల్లేశం(42) చనిపోయాడు. బసంత్‌నగర్‌‌కు చెందిన ఆరె అజయ్(24) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాపూర్‌(M) బొమ్మకల్‌లో నీటి సంపులో పడి పజ్ఞాన్ అనే రెండేళ్ల బాలుడు మృతిచెందాడు.

News March 19, 2025

అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే!

image

దాదాపు 9 నెలల తర్వాత ISS నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్‌పై ప్రపంచం దృష్టి నెలకొంది. కాగా అంతరిక్షంలో ఒకే ప్రయాణంలో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తుల్లో వాలేరి పోలికోవ్(రష్యా-437 డేస్) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఫ్రాంక్ రుబియో(US-371d), మార్క్ వాండె(355), స్కాట్ కెల్లీ(340) ఉన్నారు. సునీత, విల్మోర్ తలో 286 డేస్ అంతరిక్షంలో ఉన్నారు. కాగా సునీత తన మూడు ప్రయాణాల్లో 608 రోజులు రోదసిలో ఉన్నారు.

error: Content is protected !!