News March 19, 2025
గద్వాలలో దారుణం..!

గద్వాల మండలం చేనుగోనిపల్లిలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వృద్ధులపై గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. అనాథలైన వృద్ధులపై మానవమృగాలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు గద్వాల ఆసుపత్రికి తరలించారు. కాగా వృద్ధుల్లో ఒకరికి కళ్లు కనిపించవు. మరొకరికి మతిస్థిమితం సరిగా లేదు.. మానవత్వం మరిచి వృద్ధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
Similar News
News January 9, 2026
ANU పీజీ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో పీజీ పరీక్ష షెడ్యూల్ను పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. LLB, LLM, MSC యోగ, PG డిప్లొమా ఇన్ యోగా తదితర పరీక్షలకు సంబంధించి ఫీజు షెడ్యూల్ విడుదల చేశామన్నారు. వివరాలకు అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ను సంప్రదించాలన్నారు.
News January 9, 2026
హుస్సేన్సాగర్ చుట్టూ నైట్ బజార్!

హుస్సేన్సాగర్.. ప్రశాంతంగా ఉండే బుద్ధుడి విగ్రహం, NTR మార్గ్లో స్ఫూర్తినిచ్చే భారీ అంబేడ్కర్ విగ్రహం, ట్యాంక్బండ్పై ఉద్యమ స్ఫూర్తిని రగిల్చే తెలంగాణ అమరుల స్థూపం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అర్ధరాత్రి వరకు ఇక్కడ సందర్శకుల సందడి ఉంటుంది. ఇంకా ఆ పక్కనే తెలంగాణ సచివాలయం స్పాట్ అందరికీ ఫేవరెట్. వినోదం కోసం లుంబిని పార్క్, ఇందిరా పార్క్ ఉన్నాయి. ఇటువంటి ప్రాంతంలో HMDA నైట్ బజార్కు ప్లాన్ వేస్తోంది.
News January 9, 2026
VKB: ఆంగ్లభాషపై పట్టు సాధించాలి: డీఈవో

వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో టెడ్ టాక్ ఒలంపియాడ్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా DEO రేణుకాదేవి మాట్లాడుతూ.. విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించి వారి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. విద్యార్థులు ఇంగ్లీష్పై పట్టు సాధించడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అలవర్చుకోవాలని తెలిపారు.


