News March 19, 2025
నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి నేపథ్యం ఇదే..!

నాగర్కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వేముల నరేందర్ రావును అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఉప్పునుంతల మండలం పెద్దాపూర్కు చెందిన నరేందర్ విద్యార్థి దశ నుంచి నాయకత్వ పటిమను ప్రదర్శిస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించారు. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూనే పార్టీలో కార్యకర్తగా చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు.
Similar News
News March 19, 2025
జగిత్యాల: వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న నలుగురు వివిధ ఘటనల్లో చనిపోయారు. JGTLరూరల్(M) వెల్దుర్తికి చెందిన రాజం(55) అనే <<15808621>>రైతు<<>> అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో గంగాధర(M) ఉప్పరమల్యాలకు చెందిన మల్లేశం(42) చనిపోయాడు. బసంత్నగర్కు చెందిన ఆరె అజయ్(24) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాపూర్(M) బొమ్మకల్లో నీటి సంపులో పడి పజ్ఞాన్ అనే రెండేళ్ల బాలుడు మృతిచెందాడు.
News March 19, 2025
అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే!

దాదాపు 9 నెలల తర్వాత ISS నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్పై ప్రపంచం దృష్టి నెలకొంది. కాగా అంతరిక్షంలో ఒకే ప్రయాణంలో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తుల్లో వాలేరి పోలికోవ్(రష్యా-437 డేస్) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఫ్రాంక్ రుబియో(US-371d), మార్క్ వాండె(355), స్కాట్ కెల్లీ(340) ఉన్నారు. సునీత, విల్మోర్ తలో 286 డేస్ అంతరిక్షంలో ఉన్నారు. కాగా సునీత తన మూడు ప్రయాణాల్లో 608 రోజులు రోదసిలో ఉన్నారు.
News March 19, 2025
వరంగల్: సెల్ ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు!

సెల్ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు చేసిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. మండల కేంద్రంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణించాడు. సమయం దాదాపు రాత్రి 7 గంటలు కావడంతో సెల్ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో అక్కడ ఎలాంటి విద్యుత్ ఏర్పాట్లు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో స్నానాలు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.