News March 19, 2025
నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి

TG: ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క నేడు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో 2025-26 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఏడాది పద్దులు రూ.3లక్షల కోట్లకు పైగానే ఉండనున్నట్లు సమాచారం. 2024-25 పద్దు రూ.2.90 లక్షల కోట్లు కాగా ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ఇదే.
Similar News
News January 12, 2026
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 10% జీతం కట్: సీఎం

TG: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అలా చేస్తే ప్రతి నెలా జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తామని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి పిల్లల జీతంలో నేరుగా 10 శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాభవన్లో ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లను సీఎం ప్రారంభించారు.
News January 12, 2026
దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు: రేవంత్

TG: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని CM రేవంత్ ప్రకటించారు. దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా ఆర్థికసాయం అందిస్తామన్నారు. విద్య, ఉద్యోగాల భర్తీలో వారికి కోటాను కేటాయిస్తున్నట్లు ప్రజాభవన్లో ఓ కార్యక్రమంలో తెలిపారు. కుటుంబసభ్యుల్లా భరోసా కల్పిస్తూ వారికి రూ.50 కోట్లతో ఉపకరణాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో ఎదగాలని పిలుపునిచ్చారు.
News January 12, 2026
స్టార్‘లింక్’ కట్ చేసిన ఇరాన్.. ఎలాగంటే?

నిరసనలతో <<18832503>>అట్టుడుకుతున్న<<>> ఇరాన్లో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపేసింది. ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ నెట్ ద్వారా ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. దీంతో దానిపై ఇరాన్ అటాక్ చేసింది. ‘కిల్ స్విచ్’గా పిలిచే అత్యంత ఖరీదైన మిలిటరీ గ్రేడ్ జామింగ్ పరికరాలతో 80% స్టార్లింక్ సేవలను నిలిపేసినట్లు తెలుస్తోంది. వీటిని ఇరాన్కు రష్యా, చైనా ఇచ్చి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.


