News March 19, 2025
రామచంద్రాపురం: బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

రావులపాలెం నుంచి సాలూరుకి వెళ్లే ఆర్టీసీ బస్సు మంగళవారం సాయంత్రం రామచంద్రాపురం మార్కెట్ సెంటర్ రామాలయం వద్ద బైక్పై వెళ్తున్న పల్లి జీవరత్నం(71) అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో వెంటనే స్థానికులు అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్బాడీని మార్చురీకి పంపించారు.
Similar News
News January 21, 2026
పల్నాడు: ‘రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలి’

పల్నాడు జిల్లాలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూపరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్, భూ సర్వేలు, ప్రభుత్వ ప్రాధాన్యత పనులు సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ సేవలు సమర్థంగా అందించాలని పేర్కొన్నారు.
News January 21, 2026
జనవరి 21: చరిత్రలో ఈరోజు

1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం
News January 21, 2026
అర్హుల నుంచి టెండర్లకు ఆహ్వానం

హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అవసరమైన ప్రయోగశాల సామాగ్రి సరఫరా చేయుటకు దరఖాస్తుదారుల నుంచి టెండర్లను స్వీకరించనునట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రంలోగా అర్హులైన దరఖాస్తుదారులు హనుమకొండ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని డీఐఈఓ సూచించారు.


