News March 19, 2025

ఐదేళ్లలో రైలు టికెట్ ధరలు పెంచలేదు: కేంద్ర మంత్రి

image

దేశంలో గత ఐదేళ్లలో రైలు ఛార్జీలు పెంచలేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ LSలో వెల్లడించారు. పొరుగు దేశాలు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే మన దేశంలోనే టికెట్ ధరలు తక్కువని చెప్పారు. 350 కి.మీ దూరానికి మన దేశంలో ఛార్జ్ రూ.121గా ఉంటే, పాకిస్థాన్‌లో రూ.436, బంగ్లాలో రూ.323, శ్రీలంకలో రూ.413 అని వివరించారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంతో పోల్చితే ఇప్పుడు 90% రైలు ప్రమాదాలు తగ్గాయన్నారు.

Similar News

News January 2, 2026

బాక్సాఫీసును షేక్ చేసే సినిమా ఏది?

image

2025లో టాలీవుడ్ నుంచి ‘OG’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మినహా ఏ సినిమా రూ.300Cr+ కలెక్ట్ చేయలేదు. ధురంధర్, చావా, కాంతార: ఛాప్టర్-1 వంటి ఇతర భాషల సినిమాలు రూ.700cr+ రాబట్టాయి. దీంతో ఈ ఏడాది రిలీజయ్యే టాలీవుడ్ భారీ ప్రాజెక్టులు బాక్సాఫీసు వద్ద ఏ మేరకు రాణిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ‘రాజాసాబ్, ఫౌజీ’, NTR ‘డ్రాగన్’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు ఈ లిస్టులో ఉన్నాయి.

News January 2, 2026

టికెట్ కొనాల్సిందే.. ఇంద్రకీలాద్రిపై కొత్త విధానం!

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సిఫార్సుల ద్వారా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ టికెట్లు కొనుగోలు చేసే విధానం అమలు చేయాలని మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ భావిస్తున్నారు. ఈ మార్పు వలన ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. దుర్గగుడికి సిఫార్సుల జాబితాలో దర్శనాలకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News January 2, 2026

అయ్యప్ప యోగ ముద్ర వెన్నెముకకు రక్ష

image

అయ్యప్ప స్వామి కూర్చునే స్థితి ఓ ఆసనమే కాదు! వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మార్గం కూడా! ఈ స్థితిలో కూర్చోవడం వల్ల వెన్నుపాము నిటారుగా ఉండి, మన శరీరంలోని ప్రాణశక్తి కింద నుంచి పైకి సాఫీగా ప్రవహిస్తుంది. దీనివల్ల నడుము నొప్పి దరిచేరదు. నరాల వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఈ భంగిమ మనస్సును నిలకడగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. యోగ శాస్త్రం ప్రకారం.. ఇది అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.