News March 19, 2025
అన్నమయ్య: పుట్టిన రోజే మృతి

పుట్టిన రోజు సరదాగా స్నేహితుడితో వెళ్లిన వారికి అదే చివరి రోజు అయింది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా పీటీఎం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీనివాసులు(22)ది సోమవారం పుట్టినరోజు. తన స్నేహితుడు చందు(22)తో బి.కొత్తకోటలో సినిమా చూడటానికి వెళ్లారు. ఇంటికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Similar News
News November 2, 2025
సినీ ముచ్చట్లు

✏ చిరంజీవి ‘మన శంకర్వరప్రసాద్గారు’ నుంచి సెకండ్ సింగిల్ ఈ నెలలోనే వచ్చే అవకాశం.. ఇప్పటికే చార్ట్ బస్టర్గా నిలిచిన ‘మీసాల పిల్ల’ సాంగ్
✏ ఈ నెల 6న రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం
✏ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆంధ్ర కింగ్ తాలుకా’.. ప్రమోషన్స్ మొదలు పెట్టనున్న టీమ్
✏ కిరణ్ అబ్బవరం ‘K-RAMP’ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు.. రేపు సక్సెస్ సెలబ్రేషన్స్
News November 2, 2025
అక్రమ అరెస్ట్.. ఏ పరీక్షకైనా సిద్ధం: జోగి రాజీవ్

కల్తీ మద్యం కేసులో తన తండ్రి మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారని రాజీవ్ ఆరోపించారు. తన తండ్రి ఏ తప్పు చేయలేదని, దుర్గమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం కూడా చేశామని, అయినా కూడా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోందని అన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, అవసరమైతే నార్కోటిక్ వంటి పరీక్షలకైనా సిద్ధమని జోగి రాజీవ్ సవాల్ విసిరారు.
News November 2, 2025
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు విజయావకాశాలు: Lok Poll సర్వే

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని Lok Poll సర్వే తెలిపింది. 3,100 మందిపై సర్వే చేయగా 44% మంది కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. బీఆర్ఎస్కు 38శాతం, బీజేపీ 15శాతం, ఇతరులు 3శాతం ప్రభావం చూపుతారని వెల్లడించింది. నిన్న విడుదలైన <<18171588>>కేకే సర్వేలో<<>> బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఉపఎన్నిక ఈ నెల 11న జరగనుంది.


