News March 19, 2025

మరిపెడ: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన మరిపెడ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లంపేట గ్రామానికి చెందిన బత్తెం శ్రీను- కళమ్మ దంపతుల పెద్ద కుమారుడు బత్తెం అజయ్(21) గ్రామంలోనే ఉంటూ విద్యుత్ శాఖలో ప్రయివేటు హెల్పర్‌గా మూడేళ్లుగా పని చేస్తున్నాడు. ఇంట్లో ఎల్లమ్మ పండగ చేయగా మంగళవారం రాత్రి సమయంలో కరెంట్ వైర్లు సరి చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు చెప్పారు.

Similar News

News January 10, 2026

టీచర్‌గా మారిన కర్నూలు కలెక్టర్

image

కల్లూరు మండల పర్యటనలో భాగంగా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి టీచర్‌గా మారారు. మండల పరిధిలోని పందిపాడులో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె శనివారం తనిఖీ చేశారు. పిల్లలతో కూర్చుని ప్రీ స్కూల్ విద్యలో వారి సామర్థ్యాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం కలెక్టర్ చేయడంతో చిన్నారులు మంత్రముగ్ధులు అయ్యారు.

News January 10, 2026

నేటి విద్యార్థులే రేపటి భారత నిర్మాతలు: మంత్రి అనిత

image

నేటి విద్యార్థులే రేపటి భావి భారత నిర్మాతలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వడ్డేశ్వరంలోని KL University ఆవరణలో శనివారం జరిగిన స్టూడెంట్ ఇంటరాక్టివ్ మీట్‌లో ఆమె పాల్గొని, విద్యార్థులతో నేరుగా మమేకమయ్యారు. ఇంజినీరింగ్ మొదటి విడత ఫలితాలను విడుదల చేశారు. ఫిబ్రవరి 23న జరగనున్న ఇంటర్నేషనల్ ఉమెన్ సమ్మిట్ పోస్టర్‌తో పాటు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నీ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

News January 10, 2026

ప్రయాణికుల కోసం ప్రత్యేక చర్యలు: కోమటిరెడ్డి

image

TG: సంక్రాంతికి ఊరెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేశాం. పంతంగి టోల్ గేట్ వద్ద మాత్రమే కాస్త రద్దీ ఉంది. విజయవాడ హైవేపై ఆరు వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే నేషనల్ హైవే డైరెక్టర్‌తో మాట్లాడాం. అక్కడ యంత్రాలను కూడా తొలగించారు’ అని తెలిపారు.