News March 19, 2025
మరిపెడ: విద్యుత్ షాక్తో యువకుడి మృతి

విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన ఘటన మరిపెడ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లంపేట గ్రామానికి చెందిన బత్తెం శ్రీను- కళమ్మ దంపతుల పెద్ద కుమారుడు బత్తెం అజయ్(21) గ్రామంలోనే ఉంటూ విద్యుత్ శాఖలో ప్రయివేటు హెల్పర్గా మూడేళ్లుగా పని చేస్తున్నాడు. ఇంట్లో ఎల్లమ్మ పండగ చేయగా మంగళవారం రాత్రి సమయంలో కరెంట్ వైర్లు సరి చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు చెప్పారు.
Similar News
News November 2, 2025
దేవాలయాల వద్ద ఏర్పాట్లుపై కలెక్టర్ సూచనలు

కార్తీక సోమవారం సందర్భంగా జిల్లాలోని వివిధ దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని, దేవాలయాలపై కన్నేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా ఉండేలా అధికారులు, దేవస్థాన నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులు క్రమశిక్షణగా, శాంతియుతంగా దర్శనాలు ముగించుకోవాలన్నారు.
News November 2, 2025
ఉండవెల్లి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఉండవెల్లి మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై అక్టోబర్ 30వ తేదీన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న మెన్నిపాడు గ్రామానికి చెందిన శేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందాడు. మృతుడు భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, సంఘటనకు కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
News November 2, 2025
వినుకొండ: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

వినుకొండ పట్టణ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


