News March 19, 2025
జగిత్యాల: బడ్జెట్పైనే భారమంతా..!

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ఉమ్మడి KNR జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్లో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఓదెల, కాళేశ్వరం, ఇల్లందకుంట ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు. జమ్మికుంట బస్సుడిపో ఏర్పాటు, కల్వల ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి KNR జిల్లాకు ఇంకేం కావాలో కామెంట్ చేయండి.
Similar News
News September 14, 2025
ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి: విజయ్

ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని సినీ హీరో, TVK చీఫ్ విజయ్ అన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ పేరుతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసి, ఎలక్షన్స్ పెట్టాలని BJP చూస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని మండిపడ్డారు. 500కుపైగా హామీలు ఇచ్చిన DMK ఎన్ని నెరవేర్చిందని ప్రశ్నించారు. కానీ CM స్టాలిన్ సిగ్గులేకుండా అన్నీ నెరవేర్చామని చెప్పుకుంటున్నారని అరియలూర్ రోడ్ షోలో ఫైరయ్యారు.
News September 14, 2025
GDK: లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం: జడ్జి

లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందుతారని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకుని స్థానిక జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్ లలో రాజీ కుదుర్చుకుంటే ఒకరు గెలిచి, మరొకరు ఓడినట్లు కాదన్నారు. రాజీ పడిన వివిధ కేసులను ఆయన కొట్టివేశారు.
News September 14, 2025
కరీంనగర్: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో పోలీసులు కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ కోత్వాల్ రమేష్ మాట్లాడుతూ, ఆధార్ కార్డు మోసాలు, ఏపీకే ఫైల్స్, సిమ్ కార్డుల దుర్వినియోగం, బ్యాంక్ ఖాతా సమాచారం, లింక్స్, పెట్టుబడుల మోసాలు, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్స్ వంటి నేరాలపై ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.