News March 19, 2025
జగిత్యాల: బడ్జెట్పైనే భారమంతా..!

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ఉమ్మడి KNR జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్లో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఓదెల, కాళేశ్వరం, ఇల్లందకుంట ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు. జమ్మికుంట బస్సుడిపో ఏర్పాటు, కల్వల ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి KNR జిల్లాకు ఇంకేం కావాలో కామెంట్ చేయండి.
Similar News
News March 19, 2025
అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

అసెంబ్లీ ప్రాంగణంలో కొమురంభీం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మీ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే.. కారణం ముందుచూపు లేని కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. రైతుల పట్ల, రైతాంగం పట్ల ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయిందన్నారు. కాబట్టే పంటలు ఎండిపోయిన ప్రతి ఎకరానికి రూ. 25 వేల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
News March 19, 2025
MBNR: పరీక్షల ఫీజు చెల్లింపునకు రేపే లాస్ట్..!

పాలమూరు యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో 2వ, 4వ, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈనెల 20న ఆఖరి తేదీ కానుండగా, ఆలస్య రుసుముతో ఈనెల 25 వరకు చెల్లించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంకా ఫీజు చెల్లించని రెగ్యులర్& బ్యాక్ లాగ్ విద్యార్థులు తమ కాలేజీ వెబ్సైట్లో చెల్లించుకోవచ్చని చెప్పారు. సంబంధిత పత్రాలను కాలేజీలో సమర్పించి, రసీదును పొందాలన్నారు.
News March 19, 2025
జీవీఎంసీ బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయండి: మేయర్

జీవీఎంసీ బడ్జెట్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను కోరినట్లు విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి బుధవారం తెలిపారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరం సంబంధించి ప్రత్యేక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్కు వినతి అందజేశామన్నారు. అయితే అసెంబ్లీ మార్చి 22, 29 తేదీల్లో శాసనసభకు, పార్లమెంటుకు సెలవు ఉంటుందని ఆరోజు బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు.