News March 19, 2025

గన్నవరం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చెన్నై కోల్కతా హైవేపై బైక్‌-కారు ఢీ కొన్నాయి . ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరపనేని గూడేనికి చెందిన శ్రీనివాస్ రెడ్డి (55)ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 19, 2025

బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధమవ్వండి: కలెక్టర్

image

మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. త్వరలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్‌పై బుధవారం తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గతంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్రతో చర్చించి త్వరలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ తేదీలను ప్రకటిస్తామన్నారు. 

News March 19, 2025

పెనుగంచిప్రోలు ఉత్సవాలలో జెయింట్ వీల్ ఊడి వ్యక్తి మృతి

image

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఉత్సవాలలో జెయింట్ వీల్ ఊడిపడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు వత్సవాయి మండలం కొత్త వేమవరంకు చెందిన గింజుపల్లి సాయి మణికంఠగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 18, 2025

కృష్ణా: లబ్ధిదారుల పురోభివృద్ధికి తోడ్పడండి: కలెక్టర్

image

లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందించి వారి పురోభివృద్ధికి తోడ్పడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల సమితి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పంట సాగు చేస్తూ సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు వారి పంట మీద తప్పనిసరిగా రుణాలు అందించాలని సూచించారు.

error: Content is protected !!