News March 19, 2025

ఫోన్ ట్యాపింగ్.. వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై CBI నుంచి రాష్ట్ర సీఐడీకి సమాచారం వచ్చింది. వారిద్దరినీ వీలైనంత త్వరగా మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.

Similar News

News January 11, 2026

నిజామాబాద్: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు సాయి ప్రసన్న

image

జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారిని సాయి ప్రసన్న ఎంపికైంది. సబ్ జూనియర్ 32 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించడంతో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో సాయి ప్రసన్న పాల్గొననుంది.

News January 11, 2026

రూ.1.5లక్షల వరకు ఫ్రీ చికిత్స! త్వరలో కేంద్రం ప్రకటన

image

నేషనల్, స్టేట్ హైవేలపై ప్రమాదాల్లో గాయపడిన ఒక్కొక్కరికి రూ.1.5లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందించే పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. ఆయుష్మాన్ భారత్ పథకంతో బాధితులకు 7రోజులు ఫ్రీగా ట్రీట్‌మెంట్ చేస్తారు. ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్)లో డబ్బుల్లేని కారణంతో చికిత్స అందక మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనిని పరిష్కరించేందుకు ప్రధాని మోదీ త్వరలో ఈ పథకాన్ని ప్రకటించనున్నారు.

News January 11, 2026

నేటి ముఖ్యాంశాలు

image

✥ AP: నీటి విషయంలో రాజీపడేది లేదు: CBN
✥ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు: పవన్
✥ అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: సజ్జల
✥ TG: నేను వైద్యుడిని కాదు.. సోషల్ డాక్టర్‌ని: రేవంత్
✥ సినీ ఇండస్ట్రీ గురించి నేను పట్టించుకోవట్లేదు: కోమటిరెడ్డి
✥ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ: జనసేన
✥ ‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
✥ సంక్రాంతి సెలవులు.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ