News March 19, 2025
ఆ విద్యార్థులకు స్కాలర్షిప్ పెంపు

AP: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య యూనివర్సిటీ విద్యార్థులకు నెలవారీగా ఇచ్చే స్కాలర్షిప్ను ప్రభుత్వం పెంచింది. అండర్ గ్రాడ్యుయేట్స్కు రూ.7వేల నుంచి రూ.10,500కు, పీజీ విద్యార్థులకు రూ.9వేల నుంచి రూ.13,500కు, పీహెచ్డీ స్టూడెంట్లకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచింది.
Similar News
News March 19, 2025
హైదరాబాద్లో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్

TG: మెక్డొనాల్డ్స్ తన గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు CM రేవంత్ మెక్డొనాల్డ్స్ CEO క్రిస్ కెమ్కిన్స్కితో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా 2,000 ఉద్యోగాల కల్పన జరగనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 38 మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లు ఉండగా, ఇక నుంచి ఏటా 3- 4 కొత్త అవుట్లెట్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర రైతులు దాని కార్యకలాపాలకు తాజా ఉత్పత్తులను సరఫరా చేయనున్నారు.
News March 19, 2025
క్రెడిట్ కార్డులను క్లోజ్ చేస్తున్నారా?

కొందరు ఖర్చులు పెరిగిపోతున్నాయంటూ క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయాలని భావిస్తుంటారు. కానీ వాటిని తీసేస్తే క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. క్రెడిట్ స్కోర్ పడిపోయే ఛాన్స్ ఉంది. ఇవి అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్గా ఆదుకుంటాయి. ఈ కార్డులను యాక్టివ్గా ఉంచుకోవడమే బెటర్. అతిగా ఖర్చు చేసేవారు మాత్రం క్లోజ్ చేసుకుంటేనే మంచిది. మీరు ఉపయోగించకపోయినా మేనేజ్మెంట్ ఛార్జీలు ఎక్కువైతే కార్డు తీసేయడం ఉత్తమం.
News March 19, 2025
ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించండి: మంత్రి నాదెండ్ల

AP: దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. అన్నదాతలకు అందుబాటులో 5 లక్షల గన్నీ సంచులున్నాయని తెలిపారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.