News March 19, 2025

సాలూరు: గిరిజనులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు

image

గిరిజనులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. ఈ నెల 15న తోణాం పంచాయతీ మద్దిన వలస గ్రామంలో పొలం గట్టు గొడవలో కోనేటి లక్ష్మణరావు ఆయన భార్య ఝాన్సీలపై దాడి చేసి దూషించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 13 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Similar News

News November 4, 2025

వనస్థలిపురంలో పోస్ట్ ఆఫీస్ సేవలు 24/7

image

పోస్ట్ ఆఫీస్‌లలో 24/7 సేవలు అందుబాటులోకి తెచ్చామని ఇండియన్ పోస్ట్ హైదరాబాద్ ఆగ్నేయ మండల సీనియర్ సూపరింటెండెంట్ G.హైమవతి తెలిపారు. స్పీడ్ పోస్ట్, పార్సిల్ సర్వీస్, మనీ ఆర్డర్ సేవలను ప్రజలు అందుబాటులో ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. వనస్థలిపురం(24/7), చార్మినార్ (9PM), ఉప్పల్ (6PM), హైకోర్టు (5 PM), శంషాబాద్ 4.30PM వరకు సేవలను వినియోగించుకోవచ్చు అని G.హైమవతి తెలిపారు.
SHARE IT

News November 4, 2025

ఉప్పలగుప్తం: నాచుతో డబ్బులే డబ్బులు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు మరో రెండు జిల్లాలను సముద్రపు నాచు పెంపకానికి ఎంపిక చేసినట్లు అమృతానంద విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అమృత నటరాజన్ తెలిపారు. నాచును ఆహారంగా తీసుకుంటున్న జపాన్ దేశస్థుల ఆయుష్షు పెరిగినట్టు సర్వేలు వెల్లడించాలని ఆయన అన్నారు. ఉప్పలగుప్తం(M) వాసాలతిప్పలో సోమవారం మత్స్యకారులకు నాచు పెంపకంపై అవగాహన కల్పించారు. ఎరువులు వాడకుండానే 45 రోజులకు నాచు ఉత్పత్తి వస్తుందని వివరించారు.

News November 4, 2025

తెనాలి: ప్రభుత్వ పథకాల పేరుతో వృద్ధురాళ్లకు టోకరా

image

ప్రభుత్వ పథకం కింద తక్కువ ధరకు టీవీ, ఫ్రిడ్జ్‌ వంటి వస్తువులు ఇస్తామని, తీసుకోకుంటే పథకాలు ఆగిపోయాయని తెనాలి వీఎస్సార్‌ కళాశాల రోడ్డులో నివసించే 60 ఏళ్ల బొద్దులూరి సీతామహాలక్ష్మికి, గంగానమ్మపేటకు చెందిన లింగమల్లు ఆమనికి గుర్తు తెలియని వ్యక్తులు టోకరా వేశారు. ఒకరి వద్ద రూ.40 వేలు, మరొకరి వద్ద రూ. 30 వేలు తీసుకుని పత్తాలేకుండా పోయారు. మోసపోయామని గ్రహించిన ఇద్దరూ తెనాలి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.