News March 19, 2025
ఎస్.అన్నవరం: రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి

తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన వైసీపీ నేత కుసనం దొరబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున తుని రైల్వే స్టేషన్ నుంచి ద్విచక్రవాహనంపై ఆయన స్వగ్రామం ఎస్.అన్నవరం వెళుతుండగా కుక్కలు అడ్డురావడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. ఆయన భార్య ఎస్.అన్నవరంలో ఓ సెగ్మెంట్కి ప్రస్తుతం ఎంపీటీసీగా ఉన్నారు.
Similar News
News January 7, 2026
మొక్కజొన్న పొత్తులకు ప్లాస్టిక్ బాటిళ్లు ఎందుకు?

ఆర్గానిక్ పద్ధతిలో మొక్కజొన్నను సాగు చేసే కొందరు రైతులు పొత్తులు వచ్చాక వాటిపై ఉన్న పీచును కత్తిరించి పై ఫొటోలో చూపినట్లుగా ప్లాస్టిక్ బాటిళ్లను ఉంచుతారు. దీని వల్ల పురుగులు, బాక్టీరియా మొక్కజొన్న లోపలికి వెళ్లలేవు. అలాగే వర్షపు నీరు కూడా పొత్తులోకి వెళ్లకుండా కవచంలా పనిచేస్తుంది. ఫలితంగా ఈ పొత్తులు తాజాగా, ఎక్కడా కుళ్లకుండా, గింజ గట్టిబడి ఆకర్షనీయంగా ఉండి మంచి ధర వస్తుందనేది రైతుల అభిప్రాయం.
News January 7, 2026
కుజ దోష నివారణతో త్వరగా పెళ్లి..

జాతకంలో లగ్నం నుంచి 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు దానిని ‘కుజ దోషం’ అంటారు. దీనివల్ల వివాహ సంబంధాలు కుదరడం కష్టమవుతుంది. ఈ దోష ప్రభావం తగ్గేందుకు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ‘ఓం శరవణ భవ’ అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలుంటాయి. కుజ గ్రహానికి అధిపతి అయిన కందులను దానం చేయడం, మంగళ చండికా స్తోత్రం పఠించడం ద్వారా దోష తీవ్రత తగ్గి, త్వరగా వివాహ ఘడియలు దగ్గరపడతాయి.
News January 7, 2026
HYD: మాంజా కనిపిస్తే కాల్ చేయండి

TGFD, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ల్ సింథటిక్, గాజు పూత ఉన్న మాంజాపై నిషేధం విధించింది. HYDలో స్పెషల్ డ్రైవ్ సాగుతోంది. ప్రజలకు మాంజా కనిపిస్తే వెంటనే 1800 4255364, 040- 23231440కు కాల్ చేయాలని కోరింది. మాంజా విక్రయిస్తే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 51 ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు చేపడతామని HYD TGFD ట్వీట్ చేసింది.
# SHARE IT


