News March 24, 2024
నేను నా తండ్రిని ఒక్కసారే కలిశాను: వీరప్పన్ కూతురు

వీరప్పన్ను తాను మూడో తరగతి చదువుతున్నప్పుడు కలిశానని అతని కూతురు విద్యారాణి తెలిపారు. ఆయనను కలవడం అదే తొలి, చివరిసారి అని చెప్పారు. మెడిసిన్ చదివి ప్రజలకు సేవ చేయాలని ఆయన తనకు చెప్పారని, ఆ మాటలు ఇంకా తనకు గుర్తున్నాయని పేర్కొన్నారు. తన తండ్రి చెప్పిన మాటలే తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. న్యాయవాది అయిన ఆమె కృష్ణగిరిలో ఒక స్కూల్ను కూడా నడుపుతున్నారు.
Similar News
News January 26, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<
News January 26, 2026
ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్కు పద్మశ్రీ

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్కు బ్రాండ్ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.
News January 26, 2026
బీర సాగులో విత్తనశుద్ధి, ఎరువుల మోతాదు

కిలో విత్తనానికి థైరమ్ 3 గ్రా., ఇమిడాక్లోప్రిడ్ 5గ్రా. చొప్పున ఒక దాని తర్వాత మరొకటి కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత 100గ్రా. విత్తనానికి 2గ్రా. ట్రైకోడెర్మావిరిడేతో విత్తనశుద్ధి చేయాలి. విత్తడానికి ముందు ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు 32-40 కిలోల భాస్వరం, 16- 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు, పూత పిందె దశలో వేసుకోవాలి.


