News March 19, 2025

ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 15, 2026

నేడే పెద్ద పండుగ.. తెలుగు లోగిళ్లలో సంబరాలు

image

తెలుగు రాష్ట్రాలకు అతిపెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య ఘడియతో భోగభాగ్యాలు వస్తాయని విశ్వసిస్తారు. పంటలు ఇంటికి చేరే వేళ కావడంతో ఇది రైతుల పండుగగా ప్రసిద్ధి చెందింది. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు పల్లెల్ని పండుగ కళతో నింపేస్తాయి. పిండి వంటకాలతో ఇళ్లు పరిమళిస్తాయి. దేశవ్యాప్తంగా పొంగల్‌, లోహ్రీ, మాఘ బిహు పేర్లతో ఈ పండుగను జరుపుకుంటున్నారు.

News January 15, 2026

నేటి నుంచి అందుబాటులోకి వెస్ట్ బైపాస్‌

image

AP: విజయవాడ వెస్ట్ బైపాస్‌ను నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గుంటూరు జిల్లా కాజా-చినకాకాని జంక్షన్ నుంచి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి మీదుగా చిన్న అవుటుపల్లి టోల్‌గేట్‌ జంక్షన్ వరకు ఒకవైపు రహదారిపై అన్ని రకాల వాహనాలకు అనుమతిస్తున్నట్లు NHAI తెలిపింది. గుంటూరు, అమరావతి, విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే వాహనాలకు ఇది కీలక మార్గంగా మారనుంది.

News January 15, 2026

సంక్రాంతి: ఈ వస్తువులు కొంటే శ్రేయస్సు

image

సంక్రాంతి వేళ ఇంటికి శ్రేయస్సు తెచ్చే వస్తువులు కొనడం ఎంతో శుభప్రదమంటున్నారు వాస్తు నిపుణులు. ‘ఇంటి ప్రతికూల శక్తిని తొలగించడానికి విండ్ చైమ్స్, ఆర్థిక స్థిరత్వం కోసం ఉత్తర దిశలో లోహపు తాబేలు, అదృష్టం కోసం క్రిస్టల్ వస్తువులు ఉంచాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ప్రధాన ద్వారానికి లక్కీ నాణేలు, దాంపత్య బంధం బలపడటానికి నైరుతి దిశలో మాండరిన్ బాతుల జంటను ఏర్పాటు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.