News March 19, 2025
ఎనుమాముల మార్కెట్లో భారీగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 1, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ కొత్తగూడెం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
✓ భద్రాచలం: ముగ్గురు మహిళలపై కత్తితో దాడి
✓ మణుగూరు: చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం
✓ పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ
✓ భద్రాచలం: గుండెపోటుతో నర్సింగ్ విద్యార్థిని మృతి
✓ అశ్వారావుపేట: మామిడి తోటలో ఉరేసుకుని వ్యక్తి మృతి
✓ బెండాలపాడు గ్రామంలో పర్యటించిన ట్రైనీ కలెక్టర్
News November 1, 2025
85% మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లు స్థానికులకే: దామోదర

TG: మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఇప్పటివరకూ మేనేజ్మెంట్ కోటా సీట్లన్నీ ఆల్ ఇండియా కేటగిరీలో భర్తీ చేశారు. తాజా నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ, 70 డెంటల్ పీజీ సీట్లు దక్కనున్నాయి.
News November 1, 2025
‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేయాలి’

కొత్తగూడెం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఎస్ఈసీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం వీసీ ద్వారా సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. రివిజన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అ.కలెక్టర్ వేణుగోపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఎన్నికల సూపరింటెండెంట్ రంగప్రసాద్ పాల్గొన్నారు.


