News March 19, 2025

తెలంగాణ రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా పాలమూరు వాసి

image

దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు కెప్టెన్‌గా మక్తల్ పట్టణానికి చెందిన పీడీ బి.రూప ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన రూపను ఉమ్మడి జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. CONGRATULATIONS.

Similar News

News March 20, 2025

రాజకీయ నాయకులతో మహబూబాబాద్ కలెక్టర్ సమీక్ష

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. ఓట్ల నమోదు ప్రక్రియ గురించి రాజకీయ పార్టీల నాయకుల నుండి సలహాలు సూచనలు తీసుకున్నారు. అనంతరం వాడితో మాట్లాడుతూ.. పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీ నాయకులు విజయ సారధి రెడ్డి, మార్నేని వెంకన్న, సురేశ్ పెరుగు కుమార్, శివరాజ్ పాల్గొన్నారు.

News March 20, 2025

పాఠశాలను తనిఖీ చేసిన MHBD అదనపు కలెక్టర్

image

కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఎంపికైన పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ పరిశీలించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష జరిగే సమయాల్లో పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేసి 144 సెక్షన్ విధించడం జరుగుతుందన్నారు.

News March 20, 2025

MTM: ‘ఉద్యోగులు కర్మ యోగి భారత్ ఆన్ లైన్ శిక్షణ పూర్తి చేయాలి’

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉద్యోగులందరూ ఈ నెల 26వ తేదీలోగా కర్మయోగి భారత్ ఆన్ లైన్ శిక్షణ పూర్తి చేసుకుని ధృవీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అధికారులతో ఐ గాట్ కర్మయోగి భారత్ శిక్షణ కార్యక్రమంపై వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

error: Content is protected !!