News March 19, 2025

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: బడ్జెట్‌లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున అందుతాయని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్‌గా రూ.24,439 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇప్పటికే మూడు ఎకరాల లోపు వారికి రైతు భరోసా నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News November 7, 2025

బనకచర్ల DPR టెండర్ల ప్రక్రియను రద్దు చేసిన AP

image

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి DPR కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు AP ప్రకటించింది. HYDలో జరిగిన పోలవరం అథారిటీ సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించింది. అంతర్రాష్ట్ర నదీజలాల ఒప్పందాలకు విరుద్ధంగా ఏపీ ఈ ప్రాజెక్టును చేపడుతోందని తెలంగాణ తొలినుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనిపై కేంద్రానికి, CWCకి ఫిర్యాదు చేసింది. న్యాయపోరాటానికీ సిద్ధమైంది. దీంతో AP ఈ ప్రకటన చేసింది.

News November 7, 2025

సుధీర్ బాబు ‘జటాధర’ సినిమా రివ్యూ

image

లంకె బిందెలకు కాపలా ఉండే ధన పిశాచి, ఓ ఘోస్ట్ హంటర్ చుట్టూ జరిగే కథే ‘జటాధర’ మూవీ. ఆడియన్స్ పేషన్స్‌ను టెస్ట్ చేసే సినిమా ఇది. స్టోరీలో బలం, కొత్త ధనం లేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఏమాత్రం మెప్పించదు. అక్కడక్కడా కొన్ని థ్రిల్లింగ్ అంశాలు, BGM ఫర్వాలేదనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ ఇబ్బందిపెడుతుంది. సాగదీత, ఊహకు అందే సీన్లు, రొటీన్ క్లైమాక్స్ నిరాశకు గురిచేస్తాయి. రేటింగ్: 1/5

News November 7, 2025

క్షమాపణలు చెప్పిన రిలయన్స్, స్కోడా.. ఎందుకంటే?

image

ఏదైనా భారీ తప్పిదం జరిగినప్పుడు కంపెనీలు తమ కస్టమర్లకు క్షమాపణలు చెప్పడం సహజమే. కానీ ఒకేసారి పలు కంపెనీలు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. అయితే సరికొత్త సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ సరదాగా ట్వీట్ చేశాయా కంపెనీలు. ‘నాణ్యమైనవి చౌకగా ఇస్తున్నందుకు’ రిలయన్స్, సేఫ్టీలో కాంప్రమైజ్ కానందుకు స్కోడా & ఫోక్స్ వాగన్ కంపెనీలు క్షమాపణలు చెప్పాయి.