News March 19, 2025
పరీక్షలకంటే అంత ఇంపార్టెంట్ ఇంకేముంది?

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. అయితే, ఏడాదంతా కాలేజీలకు వెళ్లిన వేలాది స్టూడెంట్స్ పరీక్షలకు గైర్హాజరవుతున్నారు. తొలి పరీక్షను ఏకంగా 17వేల మంది రాయలేదు. నిన్న ఫిజిక్స్ & ఎకనామిక్స్ పరీక్షలు జరగ్గా 13,403 మంది డుమ్మా కొట్టారు. పరీక్షలకంటే అంత ఇంపార్టెంట్ ఇంకేముంటుంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాను రాను విద్యార్థులు చదువును మరింత నెగ్లెక్ట్ చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
Similar News
News March 20, 2025
BREAKING: ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు

AP: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో ఇద్దరు MLAలు, ఓ MLC గాయపడ్డారు. రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి కబడ్డీ ఆడుతూ వెనక్కి పడిపోవటంతో తలకు స్వల్పగాయమైంది. అలాగే రైల్వేకోడూరు MLA అరవ శ్రీధర్ కూడా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. దీంతో ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. క్రికెట్ ఆడుతూ MLC రాంభూపాల్ రెడ్డి కింద పడిపోయారు. వీరందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News March 20, 2025
రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా సోమనాథ్

AP: రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ను ప్రభుత్వం నియమించింది. పరిశ్రమలు, పరిశోధనలు, స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై సలహాలు ఇవ్వాలని కోరింది. అలాగే ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అడ్వైజర్గా కేపీసీ గాంధీని నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.
News March 20, 2025
పడుకునే ముందు ఈ తప్పు చేస్తున్నారా?

ప్రతి ఒక్కరూ సాధారణంగా పడుకునే ముందు పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుని నిద్రిస్తారు. అయితే తలపైన నీళ్లను పెట్టుకోకూడదని, ఇది అశుభమని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రతికూలత వ్యాపించి మానసిక స్థితి దెబ్బతింటుందని పేర్కొంటున్నాయి. అలాగే నెగటివ్ ఎనర్జీ వ్యాపించి ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతాయట. రాత్రి పూట గొంతెండిపోయే సమస్య ఉన్నవారు కాళ్ల వైపు వాటర్ బాటిల్ పెట్టుకోవడం ఉత్తమం.