News March 19, 2025
అల్లూరిలో 92మంది దూరం

అల్లూరి జిల్లాలో మొత్తం 71 పరీక్షా కేంద్రాల్లో బుధవారం టెన్త్ హిందీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని DEO. బ్రహ్మాజీరావు తెలిపారు. మొత్తం 11,548మంది విద్యార్థులకు 11,45 మంది హాజరయ్యారు. 92మంది పరీక్షలకు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. 99.20శాతం హాజరు నమోదైయిందని చెప్పారు. సరివేలు, ముంచింగిపుట్టు, జోలాపుట్టు పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు.
Similar News
News November 7, 2025
నెల్లూరు: కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు

నెల్లూరు జిల్లా ఉదయగిరి(M) గంగిరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాంట్రాక్టర్లపై లబ్ధిదారులతో కలిసి హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దేవండ్ల పిచ్చయ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీ ఏరియాలోనూ కాంట్రాక్టర్లు ఇలాగే చేశారా?
News November 7, 2025
చినప్పన్న పాలెం మాజీ సర్పంచ్ అచ్చియ్యదొర మృతి

వైసీపీ నేత, చిన్నప్పన్నపాలెం మాజీ సర్పంచ్ దొండా అచ్చియ్య దొర మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం తన ఇంటి వద్ద మెట్ల పైనుంచి జారిపడి గాయపడ్డారు. అనకాపల్లిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. బుచ్చయ్యపేట (M) కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. మూడు దఫాలు సర్పంచ్గా, రెండు దఫాలు పాల సంఘం అధ్యక్షుడిగా, వడ్డాది పీఏసీఎస్ ఉపాధ్యక్షుడిగా, కస్పా నీటి సంఘం అధ్యక్షుడిగా ఆయన పని చేశారు.
News November 7, 2025
వానొస్తే.. ట్రైసిటీ హడల్..!

ఉమ్మడి WGLలో ఇటీవల సంభవించిన వరదలు ట్రైసిటీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వర్షం అంటేనే నాళాల పక్కన ఉన్న కాలనీల ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఏ సమయానికి వరదలు వచ్చి ఇళ్లు మునుగుతాయోనని, ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు. WGLలో CM పర్యటించినా, ముంపునకు శాశ్వత పరిష్కారం దొరకలేదని, అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని నివాసితులు కోరుతున్నారు. మీ కాలనీకి వరద వచ్చిందా?


