News March 19, 2025

VKB: బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరిన పంచాయతీ

image

బీజేపీ జిల్లా పంచాయతీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకుంది. వికారాబాద్ నూతన జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి నియామకాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నాయకులు హైదరాబాద్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా అధ్యక్షున్ని మార్పు చేసేవరకు పార్టీ ఆఫీసులో నిరసన తెలుపుతామని నాయకులు స్పష్టం చేసినట్లుగా తెలిసింది. రాజశేఖర్ రెడ్డి స్థానికేతరుడు అని, నూతనంగా పార్టీలోకి వచ్చాడని వివాదం కొనసాగుతుంది. 

Similar News

News March 20, 2025

చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

image

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

News March 20, 2025

ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలపై వనపర్తి కలెక్టర్ సూచన 

image

రైతుల నుంచి 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లుతో కలిసి రబీ సీజన్ వరి కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News March 20, 2025

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS: వరంగల్ సీపీ

image

ఈనెల 21 నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద ఏప్రిల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(144 సెక్షన్) అమలులో ఉంటుందని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులుగా ఉండొద్దని సీపీ సూచించారు.

error: Content is protected !!